అపజయాలే విజయానికి మెట్లుగా..
ఉన్నత లక్ష్య సాధనకు కఠోరంగా శ్రమించాలి.. తాత్కాలిక ఆనందాలను పక్కనపెట్టాలి.. అపజయాలు లెక్క చేయక ముందుకు సాగాలి
ఐపీఎస్ శిక్షణలో కొనసాగుతూనే లక్ష్యం చేరిక
శిక్షణలో అఖిల్
న్యూస్టుడే, సిద్దిపేట, కొండపాక గ్రామీణం: ఉన్నత లక్ష్య సాధనకు కఠోరంగా శ్రమించాలి.. తాత్కాలిక ఆనందాలను పక్కనపెట్టాలి.. అపజయాలు లెక్క చేయక ముందుకు సాగాలి.. ఇలా చేసిన గ్రామీణ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఓ యువకుడు సివిల్ సర్వీసెస్ సాధించి తల్లిదండ్రులు సగర్వంగా నిలిచేలా చేశారు. అతడే సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన బుద్ధి అఖిల్. అఖిల భారత స్థాయిలో 321వ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. వైఫల్యాలకు వెరవకుండా లోపాలు బేరీజు వేసుకొని ఐదో ప్రయత్నంలో లక్ష్యాన్ని సాధించడం విశేషం.
కొండపాకకు చెందిన బుద్ధి లలిత, నరేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు. మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయమే జీవనాధారం. నరేశ్ సిద్దిపేటలో 28 ఏళ్లు కాంపౌండర్గా పని చేశారు. మూడేళ్లుగా కొండపాకలో పీఎంపీగా చేస్తూ సాగును వదల్లేదు. పెద్ద కుమారుడు అఖిల్ (26) మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. చిన్నకుమారుడు అజయ్ డిగ్రీ పూర్తి చేశారు. అఖిల్ ఇంటర్ వరకు సిద్దిపేటలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకున్నారు. పదిలో 9.8 జీపీఏ, ఇంటర్ (ఎంపీసీ) 972 మార్కులు సాధించారు. వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. 85 శాతం మార్కులతో సత్తా చాటారు. ఈ యువ కెరటం.. బాల్యంలోనే ఐఏఎస్ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఐఏఎస్ స్మితాసబర్వాల్ ఉమ్మడి మెదక్ కలెక్టర్గా పని చేసినప్పుడు అఖిల్ ఏడో తరగతి చదువుతున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, తండ్రి ప్రోత్సాహంతో సివిల్ సర్వీసెస్ సాధనే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఇంటి నుంచే సన్నద్ధం..
2018లో ఇంజినీరింగ్ పూర్తవగానే యూపీఎస్సీకి సిద్ధమయ్యారు. ఇంట్లో నుంచే చదివారు. 2019లో తొలి యత్నంలో ఆశించిన ఫలితం దక్కలేదు. 2020లో ఇదే అనుభవం ఎదురైంది. 2021లో 566వ ర్యాంకుతో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఐఏఎస్ లక్ష్యంగా నిర్దేశించుకున్న అఖిల్ శిక్షణకు వెళ్లకుండా ఏడాది పాటు సెలవు తీసుకున్నారు. 2022లో మరోమారు యత్నించగా నిరాశే మిగిలింది. 2023లో పరీక్ష రాశారు. గతేడాది డిసెంబరులో ఐపీఎస్ శిక్షణకు పయనమయ్యారు. మెరుగైన ఫలితాలు సాధించి విరామ సమయంలో సన్నద్ధమై గత జనవరిలో ముఖాముఖికి హాజరయ్యారు.
పొలం పనుల్లోనూ..
అఖిల్ తండ్రి నరేశ్ పది, తల్లి లలిత ఏడో తరగతి చదివారు. తమ పిల్లలు కష్టపడొద్దని, చదివిస్తే ఉన్నతస్థాయిలో ఉంటారనే కాంక్షతో ప్రోత్సహించారు. అఖిల్ రోజులో 10 నుంచి 12 గంటల సమయాన్ని కేటాయించారు. వ్యవసాయ పనుల్లోనూ పాలుపంచుకున్నారు. అన్ని వేడుకలకు దూరంగా ఉన్నారు. లక్ష్య సాధన తర్వాత అందర్నీ కలవవచ్చనే ఆశావహ దృక్పథంతో శ్రమించారు. ఇష్టమైన క్రికెట్నూ దూరం పెట్టారు.
ఆనందంతో ఎగిరి గంతేశా..
- నరేశ్, అఖిల్ తండ్రి
సంతోషంగా ఉంది. మా కుటుంబంలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే గొప్ప అనే భావన ఉండేది. నా కొడుకు మంగళవారం మధ్యాహ్నం ఫోన్ చేసి ‘బాపూ నేను ఐఏఎస్ సాధించా’నని చెప్పగానే ఆనందంతో ఎగిరి గంతేశా. ఆనంద భాష్పాలతో నోట మాట రాలేదు. మా బలగంలో తొలి ప్రభుత్వ, ఉన్నత ఉద్యోగం ఇదే. అతడి కష్టం ఫలించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్