శ్రీరామ యశస్సు.. ఆచరణతో ఉషస్సు
శ్రీరాముడు ప్రజలందరికీ.. ఆదర్శప్రాయుడు. సకల గుణ సంపన్నుడిగా కీర్తింపబడ్డారు. తరగని సుగుణాలతో ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారు. రామరాజ్యం.. శ్రీరామరక్ష.. అనే పదాలు తరచూ వినిపిస్తుంటాయి.
రామ చంద్రుడి స్ఫూర్తిగా అభ్యర్థులు, ఓటర్లు కదలాలి..
శ్రీరాముడు ప్రజలందరికీ.. ఆదర్శప్రాయుడు. సకల గుణ సంపన్నుడిగా కీర్తింపబడ్డారు. తరగని సుగుణాలతో ప్రజల హృదయాల్లో కొలువై ఉన్నారు. రామరాజ్యం.. శ్రీరామరక్ష.. అనే పదాలు తరచూ వినిపిస్తుంటాయి. ఆదర్శమూర్తిగా.. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారంగా పండితులు చెబుతుంటారు. లోక్సభ ఎన్నికల వేళ.. ఆ నీల మేఘశ్యాముడి గుణగణాలను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. పోటీ చేయనున్న నేతలు.. ఓటర్లు.. స్ఫూర్తిని స్మరించాల్సిన సమయమిది. నేటి శ్రీరామనవమి సందర్భంగా ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
ధర్మానికి ప్రతిరూపం..
‘రామో విగ్రహవాన్ ధర్మః’ రాముడి వ్యక్తిత్వాన్ని గురించి రావణాసురుడికి చెబుతూ శత్రువైన మారీచుడు పలికిన మాటలివి. దీనర్థం.. ధర్మానికి రూపం రాముడే. ధర్మాన్ని ఎలా ఆచరించాలి.. ఎలా జీవించాలో చూపారు. క్లిష్ట సమయంలోనూ భేదాలు చూపలేదు. ఆ ఆదర్శ మూర్తి పాలనలో.. ప్రజలు తమ సమస్యలు విన్నవించేలా గంట మోగించే విధానాన్ని పాటించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు.. ధర్మానికి కట్టుబడి ఉండాలి. తనపర భేదం లేకుండా.. పాలన అందిస్తాననే భరోసా కల్పించాలి. ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మార్పు రావాల్సి ఉంది. గెలుపొందాక నాయకులు సాంకేతిక మాధ్యమాలు, మరో మార్గంలోనైనా ప్రజలు కలిసే అవకాశం కల్పించాలి.
మాట తప్పని నైజం..
శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. తండ్రి ఆదేశాలతో విశ్వామిత్రుడి వద్దకు వెళ్లారు. ఇచ్చిన మాటను ఎన్నడూ తప్పలేదు. వారి స్ఫూర్తితో పాతతరం నేతలు ఎంతో మంది ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఔరా అనిపించారు. అప్పటి నేతల పనితీరును ప్రజలు ఇప్పటికి గుర్తు చేసుకుంటారు. ప్రస్తుత నాయకులు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారనే విమర్శలు ప్రజల్లో తరచూ వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు క్రతువు దాటే వరకు ఇదో ఆయుధంగా మారుతోంది. ఆచరణకు సాధ్యం కాని అంశాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నారు. మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. హామీలను నెరవేర్చుతామనే వైఖరిని ప్రస్పుటం చేయాలి. ప్రజల్లో ఆశావహ దృక్పథాన్ని పెంచాలి.
అసామాన్య బంధం..
రామ, లక్ష్మణ, భరత, శత్రజ్ఞుల బంధం అసామాన్యం. వనవాస సమయంలో సోదరుడైన భరతుడు రాముడి పేరిటే పాలించారు. ప్రస్తుతం అన్నదమ్ములు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. విభేదాలు తలెత్తుతున్నాయి. పదవులు చేజిక్కించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తున్నారు. రాముడి స్ఫూర్తిగా తమ బంధాన్ని పదిలం చేసుకోవాలి.
ప్రత్యర్థిని ప్రశంసించే తత్వం..
రాముడు.. ప్రత్యర్థి రావణుడిని సైతం ప్రశంసించారు. రావణ బ్రహ్మకు ఉన్న అపార జ్ఞానం, శివుడిపై భక్తి గుణాన్ని మెచ్చుకున్నారు. రావణ వధ తరువాత స్వర్ణమయమైన లంకను ఏమాత్రం ఆశించలేదు. ప్రస్తుతం రాజకీయాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారం, ఇతర సందర్భాల్లో పరస్పర విమర్శలతో కాలం నెట్టుకొస్తున్నారు. ధూషణలతో అదరగొడుతున్నారు. ఈ పరిణామాలతో రాజకీయమంటే ప్రజలకు విరక్తి కలగక మానదు. మరోవైపు ప్రభుత్వాలు.. ప్రజాప్రతినిధులు.. ఎవరికి వారుగా తమ ముద్ర వేసుకునే ప్రయత్నంలో సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. ఒకరి పనులను మరొకరు అర్ధాంతరంగా నిలిపివేస్తున్న ఉదంతాలు పరిపాటిగా మారాయి. ఫలితంగా ప్రజాధనం వృథా అవుతుంది. ప్రస్తుత తరుణంలో ప్రత్యర్థిని ప్రశంసించకున్నా.. వారి వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.
నిరాడంబరమే అలంకారం..
అయోధ్యకు రాజుగా ప్రకటించిన తరువాత పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో తండ్రి మాటను జవదాటకుండా వనవాసానికి వెళ్లారు. నిరాడంబర జీవితాన్ని కొనసాగించారు. కాషాయ వస్త్రధారణతో సరిపెట్టుకున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు వదిలి కందమూలాలు తిన్నారు. అరణ్యంలో ముళ్లదారులను అధిగమిస్తూ కఠినతర జీవనాన్ని కొనసాగించారు. కటిక నేలపై నిద్రించారు. రాళ్లనే రాజసింహసంగా మార్చుకున్నారు. ప్రస్తుత నేతలు.. నిరాడంబర జీవితానికి అలవాటుపడాలి. ప్రజాధనం వృథా చేయకుండా.. డబ్బు, పరపతిని ప్రదర్శించకుండా ముందడుగు వేయాలి. అంతిమంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా భావించాలి. అందుకు ఎంత దూరమైనా వెళ్లగలిగే ఓర్పు కలిగి ఉండాలి.
అప్పుడే రామరాజ్యం సాకారం..
ఉత్తమ పాలనను రామరాజ్యంతో పోలుస్తుంటారు. ఆ రాజ్యం రావాలంటూ ఆకాంక్షిస్తుంటారు. నిజాయతీ, నిర్భీతి, సత్యమార్గంలో రాముడు పాలన కొనసాగించారు. రాజ్య రక్షణకు పాటుపడే వారిని వివిధ హోదాల్లో నియమించారు. శాస్త్రాలను అనుసరించారు. ఆ రామరాజ్యం మన దగ్గరా సాకారం కావాలంటే.. ఓటరు పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంది. ప్రలోభాలకు లొంగకుండా సరైన నిర్ణయం తీసుకొని తీర్పునిస్తే చక్కటి పాలన అందే అవకాశం లేకపోలేదు. ఒకవేళ లొంగితే.. ఐదేళ్లు కష్టపడాల్సిందే. ప్రజాప్రతినిధిని అడిగే హక్కును కోల్పోతారు.
సరైన నిర్ణయం.. సుఖసంతోషాల మయం..
రాఘవుడు తన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు వేగుల ద్వారా పాలనపై ఆరా తీసేవారు. అవసరాలకు అనుగుణంగా ప్రజలకు అన్ని వసతులు కల్పించారు. సంక్షోభానికి తావులేకుండా పాలనను కొనసాగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఓటర్లు.. వర్గాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు మంచి చేసే విషయాన్ని పక్కనపెట్టి ఆకర్షించే యత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో చక్కగా పాలన అందిస్తారనే నమ్మకం ఉన్న వారిని ఎన్నుకోవాలి.
ఓటు హక్కు.. రామబాణం వంటిది.
తిరుగులేని నేత ఎన్నిక కావాలంటే.. సరైన రీతిలో సంధించాలి. ప్రతి ఒక్కరు గడపదాటి తమ బాధ్యతను నిర్వర్తించాలి. వేరే ఊర్లో ఉన్నామనో.. కేంద్రం దగ్గర లేదనో.. అభ్యర్థులు నచ్చలేదనే సాకులతో హక్కును కాలరాయొద్దు. అభ్యర్థులు నచ్చని పక్షంలో ‘నోటా’ ఉందనే విషయాన్ని విస్మరించొద్దు. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో వివిధ సందర్భాల్లో పోలింగ్ శాతం తగ్గుతోంది. ఇది ఆలోచించాల్సిన విషయం. అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా ముందుకు కదిలితే శతశాతం సాధ్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి