త్రిముఖ పోరు.. పాగా వేసేదెవరు?
గతంలో ఎన్నడూ లేని విధంగా జహీరాబాద్ లోకసభ స్థానంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి
జహీరాబాద్ పరిధిలో ప్రధాన పార్టీల ముమ్మర యత్నం
ఈనాడు, కామారెడ్డి, న్యూస్టుడే, జహీరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా జహీరాబాద్ లోకసభ స్థానంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్(సురేష్ షెట్కార్), 2014, 2019లో తెరాస(బీబీపాటిల్) అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున సురేష్ కుమార్ షెట్కార్, భాజపా నుంచి బీబీ పాటిల్, భారాస అభ్యర్థిగా గాలి అనిల్కుమార్ బరిలో నిలిచారు. కాంగ్రెస్, భాజపా, భారాస అభ్యర్థులు ఎవరికివారు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రచారం నిర్వహిస్తుండటంతో సార్వత్రిక పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఎటువైపు మొగ్గుతారో..: 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఎల్లారెడ్డి స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలోని నాలుగు స్థానాల్లో భారాస, మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్కు ఆధిక్యం లభించింది. త్వరలో జరగనున్న లోకసభ ఎన్నికల్లో ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో ఫలితాల అనంతరం తేలనుంది.
మండల స్థాయిలో సమావేశాలు: జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 2009, 2014, 2019లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, భారాసల మధ్యనే పోరు సాగింది. ప్రస్తుతం త్రిముఖ పోరు నెలకొంది. భారాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే మండల, నియోజకవర్గస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాయి. నామపత్రాల దాఖలుకు మూడు పార్టీల అభ్యర్థులు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. తదనంతరం ప్రచారాన్ని హోరెత్తించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ