జోరుగా ఉపాధి పనులు
జిల్లాలో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు
నిత్యం 50 వేల మందికి పైగా హాజరు
ఎస్.కొండాపూర్లో..
మెదక్, న్యూస్టుడే: జిల్లాలో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. ప్రతిరోజు సగటున 50 వేల మందికి పైగా హాజరవుతున్నారు. ఇటీవల భత్యాన్ని కేంద్రం మరింత పెంచింది. జిల్లా ఉన్నతాధికారులు గ్రామాల వారీగా లక్ష్యాన్ని విధించడంతో పనిచేసే వారి సంఖ్య పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి గ్రామపంచాయతీకి 150 మంది కూలీలు హాజరయ్యేలా లక్ష్యం విధించగా సగటున 116 మంది వస్తున్నారు.
వలసలు నివారించేందుకు, ఉన్న ఊరిలో పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధిహమీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ పథకం ద్వారా 190 రకాల పనులను చేపట్టే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా 47 లక్షలు పూర్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. 2024-25లో 50 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జలసంరక్షణకు ప్రాధాన్యం
జిల్లా వ్యాప్తంగా జల సంరక్షణకు అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఫీడర్ ఛానళ్ల ఏర్పాటు, చెరువులు, కుంటల్లో పూడిక తీయడం, పొలాలకు వచ్చే నీటి కాలువలను బాగు చేయడం వంటి పనులు చేపడుతున్నారు. దీంతో పాటు వ్యవసాయ పొలాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు.
భానుడి ప్రతాపంతో..
భానుడి ప్రతాపం కారణంగా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే పనులకు వెళ్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తుస్తున్నారు. ప్రతి కూలీకి 2 లీటర్ల నీళ్లకు రూ.2.50 చెల్లిస్తున్నారు. ఇటీవలే కూలి రూ.272కు నుంచి రూ.300 వరకు పెంచడంతో ఈ నెల 1వ తేదీ నుంచి పనులకు కూలీల రాక జోరందుకుంది. సెలవుదినాల్లో కాస్త తగ్గుతోంది. ప్రస్తుతం సగటున రూ.210 అందుతోంది.
ప్రతి కూలీకి పని కల్పిస్తాం: శ్రీనివాస్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
పనుల సీజన్ కావడంతో ప్రతి పంచాయతీలో నిత్యం 150 మంది కూలీలు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లెక్కన 70 వేలకు పైగా రావాలి. సగటున 50 వేలకు పైగా వస్తున్నారు. భత్యం పెంచడంతో ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో పనులు చేసే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్