విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు: సీపీ
గంజాయి, మాదకద్రవ్యాల వినియోగాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని పోలీసు కమిషనర్ అనూరాధ తెలిపారు. సైబర్నేరాల్లో నిలిపివేసిన నగదును త్వరగా బాధితులకు ఇప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.
సిద్దిపేట టౌన్: గంజాయి, మాదకద్రవ్యాల వినియోగాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని పోలీసు కమిషనర్ అనూరాధ తెలిపారు. సైబర్నేరాల్లో నిలిపివేసిన నగదును త్వరగా బాధితులకు ఇప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. కమిషనరేట్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులపై ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో శనివారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆమె పలు సూచనలు చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల పట్టణంలోని ఓ వ్యవసాయి బావిలో పడి యుకువడు దుర్మరణం పాలుకాగా వెతికి మృతదేహాన్ని బయటకు తీసిన ఏఎస్సై ఉమారెడ్డిని సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు.
జల్సాలకు అలవాటై చోరీలు.. ఇద్దరి అరెస్టు
సిద్దిపేట టౌన్: జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించేందుకు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. వివరాలను కమిషనరేట్లో సీపీ అనూరాధ శనివారం వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన ములకలపల్లి వెంకన్న గజ్వేల్లో ఫారెస్టు బీట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 13న ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లగా చోరీకి పాల్పడి ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. కేసును ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐ సైదా దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి శనివారం పట్టణంలో అరెస్టు చేశారు. నిందితులు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షరీఫ్, తవాబ్గా గుర్తించారు. కొన్నాళ్ల కిందట గజ్వేల్కు వచ్చి ఇద్దరూ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నారు. జల్సాలకు డబ్బు అవసరమై దొంగతనం కోసం పట్టణంలో రెక్కీ నిర్వహించి చేశారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.
గొలుసు దుకాణాల్లో మద్యం స్వాధీనం
నంగునూరు: గట్లమల్యాలలో గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాజగోపాలపేట పోలీసులతో కలిసి శనివారం దాడులు నిర్వహించారు. పోగుల సతీశ్ ఇంట్లో నిల్వచేసిన 36.920 లీటర్ల మద్యం సీసాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి