పార్టీల వ్యూహాలు.. గెలుపుపైనే ఆశలు
లోక్సభ ఎన్నికల పోలింగ్కు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే ప్రచారంలోకి దిగిన మూడు ప్రధాన పార్టీలు జహీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.
అసెంబ్లీ ఫలితాలు విశ్లేషించుకుంటూ ముందుకెళ్తున్న నాయకులు
ఈనాడు, కామారెడ్డి, న్యూస్టుడే, జహీరాబాద్: లోక్సభ ఎన్నికల పోలింగ్కు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే ప్రచారంలోకి దిగిన మూడు ప్రధాన పార్టీలు జహీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం భారాస, కేంద్రంలో హ్యాట్రిక్ సాధించేందుకు భాజపాలు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే అధికంగా సాధించేలా ఆయా పార్టీలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.
ప్రత్యేక దృష్టి..
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా అభ్యర్థి ఇంటింటికీ తిరిగి ఓటు అభ్యర్థించే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలను పోలింగ్ కేంద్రాల వారీగా విశ్లేషిస్తూ అభ్యర్థులు ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు. తక్కువగా ఓట్లు వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతాన్ని కూడా పరిశీలిస్తూ మెరుగ్గా ఫలితం వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
అంతా తామై వ్యవహరిస్తూ..
అధికార కాంగ్రెస్, భారాస పార్టీల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ బాధ్యులకు లక్ష్యాలను నిర్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించారు. భారాస అధినేత కేసీఆర్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓటమి చెందిన అభ్యర్థులకు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించి ప్రచార బాధ్యతలు చేపట్టాలని నిర్దేశించారు. దీంతో అంతా తామై వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మెజారిటీని పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఓటమి చెందిన అభ్యర్థులు లోపాలను సరిదిద్దుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధిష్ఠానం వద్ద తమ సత్తా చాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భాజపా నాయకులు కేంద్రంలో మోదీ అందించిన పాలనను వివరిస్తూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన కార్యాచరణతో ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్