ఉజ్వల భవితకు పాలిటెక్నిక్..
పాలిటెక్నిక్.. ఉజ్వల భవితను సొంతం చేసుకునేందుకు మార్గం చూపే కోర్సు. పదో తరగతి పూర్తవగానే అత్యధికులు ఇంటర్లో చేరాలని అనుకుటారు. కానీ కొందరు మాత్రం పాలిటెక్నిక్ వైపు మొగ్గుచూపుతారు.
22 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
ఓ పాలిటెక్నిల్లో చదువుకుంటున్న విద్యార్థులు
న్యూస్టుడే, చేగుంట: పాలిటెక్నిక్.. ఉజ్వల భవితను సొంతం చేసుకునేందుకు మార్గం చూపే కోర్సు. పదో తరగతి పూర్తవగానే అత్యధికులు ఇంటర్లో చేరాలని అనుకుటారు. కానీ కొందరు మాత్రం పాలిటెక్నిక్ వైపు మొగ్గుచూపుతారు. త్వరగా ఉపాధి పొందే వీలుండటంతో పాటు ఇంజినీరింగ్లో నేరుగా రెండు ఏడాదిలో చేరడానికి అవకాశం ఉండటమే ప్రధాన కారణం. ప్రస్తుతం పాలిసెట్ దరఖాస్తు గడువు సమీపించింది. ఈనెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివిధ కోర్సులు: పాలిటెక్నిక్లో మూడేళ్ల వ్యవధితో కూడిన డీఈఈఈ, డీఎంఈ, డీసీఎంఈ, సివిల్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి డిప్లొమా కోర్సులు ఉన్నాయి. మూడేళ్లు శ్రమించి మంచి ఉత్తీర్ణత సాధిస్తే క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించి పలు కంపెనీలు ఉద్యోగాల్లో చేర్చుకునే అవకాశం లేకపోలేదు. లేదంటే ఈసెట్ రాసి బీటెక్లో నేరుగా రెండో సంవత్సరంలోకి చేరే అవకాశం ఉంది.
14 చోట్ల..: ఉమ్మడి మెదక్, వికారాబాద్ 14 పాలిటెక్నిక్లు కొనసాగుతున్నాయి. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉంటాయి. చేగుంట, గోమారం, హుస్నాబాద్ (కో-ఎడ్యుకేషన్), గజ్వేల్, సిద్దిపేట, జోగిపేట, నారాయణఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్ (బాలురు), మెదక్, సిద్దిపేట, జోగిపేట (బాలికలు)ల్లో పాలిటెక్నిక్లు ఉన్నాయి. అన్ని చోట్ల ల్యాబ్ సౌకర్యం ఉండటంతో విద్యార్థులకు ఉపయోగంగా మారింది.
వసతిగృహాలు సైతం..: పాలిటెక్నిక్లు ఉన్న చోట ప్రభుత్వం వసతిగృహాలనూ ఏర్పాటు చేసింది. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రయోజనంగా మారింది. ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించడంతో వీటిల్లో ఎంచక్కా చేరి ఇష్టమైన కోర్సు చేసే వీలుంది. జెన్కో, ఎన్టీపీసీ, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్వే, సింగరేణి, ఐఓసీఎల్, బీహెచ్్ఈఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో క్లర్క్ కొలువులు లభిస్తాయి. ఐటీఐ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్లో ఇస్ట్రక్టర్గా పని చేయవచ్చు. ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరి ఆపై ప్రాంగణ నియామకాలకు వెళ్తే పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి:
చక్రవర్తి, ప్రిన్సిపల్, చేగుంట
పాలిటెక్నిక్ విద్యార్థుల భవితకు తోడ్పడుతుంది. దరఖాస్తు చేసుకోవటానికి గడువు సమీపించింది. పది పరీక్షలు రాసి ఆసక్తి ఉన్న వారు ముందుకు రావాలి. అన్ని చోట్ల సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశారు. సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం