స్థానికేతరులకే పట్టం
ఏదైనా స్థానం నుంచి పోటీ చేసే సమయంలో స్థానికత, స్థానికేతర అంశాలు చర్చనీయాంశంగా ఉంటాయి. గెలుపోటముల్లోనూ ఈ అంశం ప్రభావం చూపుతుంటుంది.
మెదక్ ఖిల్లా...
ఏదైనా స్థానం నుంచి పోటీ చేసే సమయంలో స్థానికత, స్థానికేతర అంశాలు చర్చనీయాంశంగా ఉంటాయి. గెలుపోటముల్లోనూ ఈ అంశం ప్రభావం చూపుతుంటుంది. చారిత్రక నేపథ్యం ఉన్న మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు గెలిచిన వారిలో నలుగురు తప్ప మిగతా వారంతా ఇతర జిల్లాల వారే కావడం గమనార్హం. 1952లో నియోజకవర్గం ఏర్పడగా, తొలి ఎంపీ ఎన్.ఎం.జయసూర్య నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ వరకు, ఆ తర్వాత ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆలే నరేంద్ర, విజయశాంతిలు సైతం స్థానికేతరులే. ఎన్.ఎం జయసూర్య, హన్మంత్రావు, సంగం లక్ష్మిబాయి సికింద్రాబాద్కు చెందిన వారు. 1971లో గెలుపొందిన డా.మల్లికార్జున్ స్వస్థలం మహబూబ్నగర్. ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్కు చెందిన వారు కాగా, 1999లో భాజపా తరఫున గెలిచిన ఆలే నరేంద్ర, 2009లో తెరాస నుంచి గెలుపొందిన విజయశాంతి హైదరాబాద్వాసులే కావడం గమనార్హం.
ఉమ్మడి జిల్లా నుంచి...
ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు నలుగురే ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. 1984లో తెదేపా నుంచి గెలిచిన ఎంపీ మాణిక్రెడ్డి సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్ కాగా, 1989 నుంచి 1999 వరకు వరుసగా నాలుగు సార్లు విజయాలు సాధించిన ఎం.బాగారెడ్డ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్. 2014లో ఎంపీగా ఉన్న కేసీఆర్ స్వస్థలం సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలం చింతమడక. దుబ్బాక మండలం పోతారానికి చెందిన కొత్త ప్రభాకర్రెడ్డి 2014 ఉప ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసి విజయం అందుకున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న రఘునందన్రావు (భాజపా) సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం బొప్పాపూర్ స్వగ్రామం కాగా, నీలం మధు (కాంగ్రెస్) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కూల్కు చెందిన వారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామం. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో నివాసం ఉంటున్నారు.
న్యూస్టుడే, మెదక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు