అందని భత్యం.. పేదలపై భారం
పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యాహక్కు చట్ట ప్రకారం ప్రభుత్వం వారికి రవాణా భత్యం అందజేస్తోంది.
రవాణా ఛార్జీలకు రెండేళ్లుగా విద్యార్థుల ఎదురుచూపులు
ఆటోల్లో పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు
పెద్దశంకరంపేట, న్యూస్టుడే: పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యాహక్కు చట్ట ప్రకారం ప్రభుత్వం వారికి రవాణా భత్యం అందజేస్తోంది. ఈ భత్యం విద్యార్థులకు సకాలంలో విడుదల కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. బస్సు సౌకర్యం లేని పలు గ్రామాల విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లో, కాలినడకన వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. ఇతర గ్రామాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లిస్తోంది. అయితే రెండేళ్లుగా ఈ భత్యం బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
కూలీ పనులు చేసుకొని.. జిల్లాలోని 21 మండలాల పరిధిలోని మొత్తం 890 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 86,238 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో కస్తూర్బా మినహా మిగతా అన్ని పాఠశాలలకు విద్యార్థులు ఇళ్ల నుంచి వచ్చి వెళ్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారంతా ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే. బస్సు సౌకర్యం లేని ఇలాంటి చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. కూలి పనులు చేసుకొని బతుకే భారంగా గడుపుతున్న తల్లిదండ్రులకు ప్రతిరోజు ప్రయాణ ఛార్జీలు చెల్లించి పిల్లలకు పాఠశాలలకు పంపడం ఇబ్బందిగా మారుతోంది. దీంతో ప్రభుత్వం విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రయాణ భత్యం ఇస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులు.. ప్రయాణ భత్యాన్ని పొందేందుకు ఒక కిలోమీటరు దూరం ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు, మూడు కిలోమీటర్లు దూరంగా ప్రాథమికోన్నత విద్యార్థులు, ఐదు కిలోమీటర్లు దూరంగా వెళ్లి చదివే ఉన్నత స్థాయి విద్యార్థులు అర్హులు. 1-5 తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ.4 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల వారికి రూ.6 వేలు చెల్లించాలి. ఏడాదిలో పది నెలలకు మాత్రమే ఈ భత్యాన్ని అందిస్తారు. అర్హత గల విద్యార్థుల బ్యాంకు ఖాతా వివరాలను సమగ్ర శిక్షా అభియాన్కు అందిస్తే విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపితే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా 86,238 మంది విద్యార్థులు చదువుతుండగా ఇందులో 2022-23 విద్యా సంవత్సరానికి 1224 మంది విద్యార్థులకు రూ.67.86 లక్షలు, 2023-24 విద్యా సంవత్సరానికి 1144 మంది విద్యార్థులకు రూ.63.58 లక్షలు విడుదల కావాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 23తో విద్యా సంవత్సరం ముగియనుండగా ఇప్పటికీ గతేడాది, ఈ ఏడాదికి సంబంధించిన రవాణా భత్యం విడుదల కాలేదు. విద్యా సంవత్సరం ముగియనుండటంతో ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. రెండేళ్లుగా విద్యార్థులకు భత్యం విడుదల కాకపోవడం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం: జ్యోతి, సెక్టోరియల్ అధికారి
గత రెండేళ్లుగా విద్యార్థులకు రావాల్సిన రవాణా భత్యం పెండింగ్లో ఉంది. వీటిపై ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల వివరాలు పాఠశాలల హెచ్ఎంలు సకాలంలో అందించడం లేదు. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడతాయి.
బ్యాంకు ఖాతాల సేకరణలో జాప్యం
ఈ ఏడాది 1144 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు. ఇందులో సుమారు 700 మంది విద్యార్థులకు సంబంధించి బ్యాంకు ఖాతాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమగ్ర శిక్షా అభియాన్ అధికారులకు పంపలేదు. విద్యాశాఖ నుంచి విద్యార్థులకు భత్యం విడుదలై బ్యాంకు వివరాలు లేకపోతే వారి ఖాతాల్లో జమకావు. దీంతో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దీనిపై పాఠశాలల హెచ్ఎంలు చొరవ తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం