ఆరుగాలం కష్టం.. అకాల వర్షంతో నష్టం
అకాల వర్షంతో అన్నదాత కుదేలవుతున్నాడు. ఎప్పుడు పడుతుందో తెలియని వర్షంతో కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇబ్రహీంపూర్ వద్ద రోడ్డుపై కొట్టుకుపోయిన ధాన్యం
నిజాంపేట(రామాయంపేట), అల్లాదుర్గం, చేగుంట, న్యూస్టుడే: అకాల వర్షంతో అన్నదాత కుదేలవుతున్నాడు. ఎప్పుడు పడుతుందో తెలియని వర్షంతో కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం వర్షం కురిసింది. దీంతో కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంపై టార్పాలిన్లు కప్పినా.. ధాన్యం తడిసిపోయింది. కల్వకుంట కొనుగోలు కేంద్రంలో ధాన్యం సమీపంలోకి నీరు రావడంతో కాపాడుకోవడానికి రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు.
అల్లాదుర్గంలో 26 మి.మీ.లు: అల్లాదుర్గం మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం 26 మిమీ వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ సతీష్కుమార్ శనివారం తెలిపారు. మాందాపూర్, వెంకట్రావుపేట్, గడిపెద్దాపూర్ గ్రామాల్లో గాలి బీభత్సానికి చెట్లు విరిగిపోయాయి. కొమ్మలు విద్యుత్తు తీగలపై పడడంతో గడిపెద్దాపూర్లో రెండు విద్యుత్తు స్తంభాలు విరిగిపోయాయి. మామిడి కాయలు రాలిపోయాయి. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు విరిగి పొలాల్లో పడటంతో సరిచేయలేక పోయినట్లు లైన్మెన్ నవాజ్ తెలిపారు.
గడిపెద్దాపూర్లో రాలిపోయిన మామిడి
తడిసిన ధాన్యం: చేగుంట మండలం రుక్మాపూర్, ఇబ్రహీంపూర్, బోనాల, బి.కొండాపూర్ గ్రామాల్లో రహదారులపై ఎండబెట్టిన ధాన్యం తడిసింది. పలుచోట్ల వరదకు ధాన్యం రోడ్ల కిందికి కొట్టుకుపోయింది. టార్పాలిన్లు కప్పినా కింది నుంచి నీరు వెళ్లడంతో తడిసిపోయింది. నార్సింగిలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు తడిశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి