రైతులు అసంతృప్తితో ఉన్నారు
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు ఆందోళన, అసంతృప్తితో ఉన్నారని.. నాలుగు నెలలకే పెదవి విరుస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
ప్రజ్ఞాపూర్లో అమ్మవారి ప్రతిష్ఠాపనలో హరీశ్రావు, నాయకులు
దుబ్బాక, గజ్వేల్, న్యూస్టుడే: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు ఆందోళన, అసంతృప్తితో ఉన్నారని.. నాలుగు నెలలకే పెదవి విరుస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్వగ్రామం పోతారంలోని ఆయన నివాసంలో శనివారం హరీశ్రావు ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ నాయకులతో అంతర్గత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, భారాస మెదక్ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డి, నాయకురాలు కత్తి కార్తీక, బక్కి వెంకటయ్య, ఫారుఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, అక్బర్పేట-భూంపల్లి, రాయిపోల్, దౌల్తాబాద్, చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన ముఖ్య భారాస నాయకులు, కార్యకర్తలతో విడతల వారీగా అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి గెలుపునకు ఏ విధంగా కష్టపడ్డారో, అదే విధంగా భారాస ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని హరీశ్రావు సూచించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీల అమలులో తీవ్ర జాప్యం వంటి అంశాలను, గత భారాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను స్థానిక నాయకులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. మెదక్ గడ్డపై గెలిపించి మాజీ సీఎం కేసీఆర్కు బహుమతిగా అందించాలని నాయకులకు చెప్పినట్లు సమాచారం. గంభీర్పూర్ గ్రామంలో భారాస నాయకుడు కె.ఆర్.భీమసేన తండ్రి రాజయ్య మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా హరీశ్రావు, ప్రభాకర్రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అదే గ్రామంలో వారం క్రితం ఆత్మహత్య చేసుకున్న భారాస కార్యకర్త నీరటి రాజశేఖర్ కుటుంబాన్ని ఓదార్చారు.
విగ్రహాల ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తున్న గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లోని నల్లపొచమ్మ-ముత్యాలమ్మ దేవతా మూర్తులను మాజీ మంత్రి హరీశ్రావు శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. అనంతరావుపల్లిలో నిర్వహిస్తున్న బొడ్రాయి పండుగ సందర్భంగా పూజలు చేశారు. వెంకట్రామిరెడ్డి, యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్రెడ్డి, రాజమౌళి, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి