కొత్తగా మరో 5 వేలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైంది ఎన్నికల క్రతువు. ఇందులో యువత భాగస్వామ్యం కావాల్సిన అవసరం చాలా ఉంది. ముందుగా యువతి, యువకులు బాధ్యతగా ఓటు హక్కు పొందాలి.
ఓటు నమోదుకు దరఖాస్తుల సమర్పణ
చైతన్య కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు
న్యూస్టుడే, సిద్దిపేట: ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైంది ఎన్నికల క్రతువు. ఇందులో యువత భాగస్వామ్యం కావాల్సిన అవసరం చాలా ఉంది. ముందుగా యువతి, యువకులు బాధ్యతగా ఓటు హక్కు పొందాలి. ఇటీవల చేపట్టిన ఓటరు నమోదు, సవరణకు వారి నుంచి చక్కటి స్పందన లభించింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఏప్రిల్ 15 వరకు నమోదు, సవరణ, మార్పుచేర్పులకు అవకాశం కల్పించింది. ఫలితంగా జిల్లాలో వివిధ విభాగాల్లో 12,167 దరఖాస్తులు అందాయి. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరి పార్లమెంట్ ఎన్నికల్లోనూ స్ఫూర్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు.
ఫారం 6కు 5,439 దరఖాస్తులు
ఫిబ్రవరి 8న ప్రకటించిన ఓటరు తుది జాబితా ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 9,61,361. అందులో పురుషులు 4,71,616, మహిళలు 4,89,663, ఇతరులు 82 మంది ఉన్నారు. సంఖ్యాపరంగా పురుషులతో పోల్చితే మహిళలు - 18,047 మంది ఎక్కువగా ఉన్నారు. గత ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్ 15 వరకు మరోసారి కొత్తవారి కోసం దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగా ఓటరు నమోదు (ఫారం-6)కు 5,439 మంది ముందుకొచ్చారు. మరణించిన వారు లేదా స్థానికంగా నివాసం ఉండని ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు (ఫారం-7) 1,811 దరఖాస్తులు అం దాయి. ఓటరు కార్డులో సవరణ, పోలింగ్ కేంద్రం మార్పులు-చేర్పులకు, కొత్త కార్డు పొందే (ఫారం-8) విభాగంలో 4,917 మంది సమర్పించారు.
గజ్వేల్ నుంచి గరిష్ఠం
జిల్లాలో ఎక్కువ శాతం నూతన ఓటరు నమోదుకు దరఖాస్తులు అందాయి. అందులో గరిష్ఠంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి, కనిష్ఠంగా దుబ్బాక నుంచి ఉన్నాయి. ప్రత్యక్షంగా బీఎల్వోలు స్వీకరించారు. పరోక్షంగా ఆన్లైన్ విధానంలో అవకాశం కల్పించారు. సవరణ, మార్పు-చేర్పులకు సంబంధించి సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎక్కువ శాతం మొగ్గు చూపారు. ఈ నెల ఆఖరుకు తుది జాబితా వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముందడుగు వేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్