హామీలు మాత్రమే ఇచ్చేది కాంగ్రెస్.. అమలు చేసేది భాజపా
హామీలను మాత్రమే ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అని, ఇచ్చిన హామీలను అమలుచేసి చూపేది భాజపా అని మెదక్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు.
మాట్లాడుతున్న రఘునందన్రావు, మురళీ మనోహర్రావు, కప్పర ప్రసాద్రావు
అమీర్పేట, న్యూస్టుడే: హామీలను మాత్రమే ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అని, ఇచ్చిన హామీలను అమలుచేసి చూపేది భాజపా అని మెదక్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. అమీర్పేటలోని ఆదిత్యా పార్క్ ఇన్ హోటల్లో ఆదివారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రఘునందన్రావుతో క్రాస్ టాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడుతూ మెదక్ జిల్లాకు రైల్వే లైను తెచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి మెదక్లో తప్పుడు స్క్రిప్టు చదివారని.. ఐడీపీఎల్ మెదక్లో ఉందని చెప్పారని, అది రంగారెడ్డి జిల్లాలో ఉండేదన్నారు. రేవంత్రెడ్డి ఎప్పుడు వచ్చినా తన గడీని రాసిస్తానన్నారు.
చర్చకు సిద్ధం: దుబ్బాక అభివృద్ధిపై రేవంత్రెడ్డి ఎప్పుడు వచ్చినా చర్చకు సిద్ధమని రఘునందన్రావు సవాలు విసిరారు. కేరళ ఎన్నికల ప్రచారంలో కమ్యూనిస్టులు కాదు కమ్యూనలిస్టులని రేవంత్రెడ్డి విమర్శిస్తే.. ఉప ముఖ్యమంత్రి కమ్యూనిస్టులను దేశభక్తులని కొనియాడారన్నారు. భాజపా, భారాసలు కలిసి సుపారీ రాజకీయాలు చేస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మెదక్ అభివృద్ధిని సర్వనాశనం చేసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని, రాజ్పుష్ప సంస్థల్లో ఆయన పాత్ర అందరికీ తెలుసన్నారు. భారాసతో రేవంత్రెడ్డికి సంబంధాలు లేకపోతే వెంకట్రామిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షుడు ³రళీమనోహర్రావు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ