logo

హామీలు మాత్రమే ఇచ్చేది కాంగ్రెస్‌.. అమలు చేసేది భాజపా

హామీలను మాత్రమే ఇచ్చే పార్టీ కాంగ్రెస్‌ అని, ఇచ్చిన హామీలను అమలుచేసి చూపేది భాజపా అని మెదక్‌ పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

Published : 22 Apr 2024 02:00 IST

మాట్లాడుతున్న రఘునందన్‌రావు, మురళీ మనోహర్‌రావు, కప్పర ప్రసాద్‌రావు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: హామీలను మాత్రమే ఇచ్చే పార్టీ కాంగ్రెస్‌ అని, ఇచ్చిన హామీలను అమలుచేసి చూపేది భాజపా అని మెదక్‌ పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. అమీర్‌పేటలోని ఆదిత్యా పార్క్‌ ఇన్‌ హోటల్‌లో ఆదివారం తెలంగాణ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రఘునందన్‌రావుతో క్రాస్‌ టాక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ మెదక్‌ జిల్లాకు రైల్వే లైను తెచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మెదక్‌లో తప్పుడు స్క్రిప్టు చదివారని.. ఐడీపీఎల్‌ మెదక్‌లో ఉందని చెప్పారని, అది రంగారెడ్డి జిల్లాలో ఉండేదన్నారు. రేవంత్‌రెడ్డి ఎప్పుడు వచ్చినా తన గడీని రాసిస్తానన్నారు.

చర్చకు సిద్ధం: దుబ్బాక అభివృద్ధిపై రేవంత్‌రెడ్డి ఎప్పుడు వచ్చినా చర్చకు సిద్ధమని రఘునందన్‌రావు సవాలు విసిరారు. కేరళ ఎన్నికల ప్రచారంలో కమ్యూనిస్టులు కాదు కమ్యూనలిస్టులని రేవంత్‌రెడ్డి విమర్శిస్తే.. ఉప ముఖ్యమంత్రి కమ్యూనిస్టులను దేశభక్తులని కొనియాడారన్నారు. భాజపా, భారాసలు కలిసి సుపారీ రాజకీయాలు చేస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మెదక్‌ అభివృద్ధిని సర్వనాశనం చేసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని, రాజ్‌పుష్ప సంస్థల్లో ఆయన పాత్ర అందరికీ తెలుసన్నారు. భారాసతో రేవంత్‌రెడ్డికి సంబంధాలు లేకపోతే వెంకట్రామిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షుడు ³రళీమనోహర్‌రావు, తెలంగాణ జర్నలిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని