వెంకట్రామిరెడ్డికి పోటీ చేసే అర్హత లేదు
చట్టాలు, కోర్టులపై ఏమాత్రం గౌరవం లేని మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి చట్టసభకు ఎంపీగా వెళ్లే అర్హత ఏమాత్రం లేదని మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల ప్రతినిధులు..
మాట్లాడుతున్న నిర్వాసిత గ్రామస్థులు
గజ్వేల్, న్యూస్టుడే: చట్టాలు, కోర్టులపై ఏమాత్రం గౌరవం లేని మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి చట్టసభకు ఎంపీగా వెళ్లే అర్హత ఏమాత్రం లేదని మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల ప్రతినిధులు హయతుద్దీన్, శ్రీనివాస్రెడ్డి, ఆశోక్, బాల్రెడ్డి, కృష్ణ, మధుసూదన్రెడ్డి, తిరుపతి, బాల్రెడ్డి, ఎంకె రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ప్రెస్క్లబ్లో వారు విలేకరుల సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. సిద్దిపేట కలెక్టర్గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి.. ఒంటెద్దు పోకడలతో అప్పటి ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడేందుకు మల్లన్నసాగర్ నిర్వాసితుల ఉసురు పోసుకున్నారన్నాని విమర్శించారు. ఆయన ఎంపీగా గెలిచి రూ.100 కోట్ల నిధితో ఉద్ధరిస్తామంటే ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని నమ్మబలికి నాడు తమను బలవంతంగా ఊళ్లు ఖాళీ చేయించి రెండు పడక గదుల ఇళ్లలో తాత్కాలికంగా నివాసం కల్పించారన్నారు. మూడేళ్లయినా తమకు ఖాళీ స్థలాలు.. ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షలు ఇవ్వలేదని వాపోయారు. తమ సమస్యలు తీర్చిన వెంటనే రెండు పడక గదుల ఇళ్లను ఖాళీ చేస్తామని అప్పటి వరకు ఇబ్బందులు పెట్టవద్దని కోరుతున్నామన్నారు. అద్భుతమైన కాలనీలు కట్టించామని మాజీ మంత్రి హరీశ్రావు ప్రచారం చేయటం హాస్యాస్పదమన్నారు. నిర్వాసితుల పక్షాన కొట్లాడి పోలీసు దెబ్బలు తిన్న వంటేరు ప్రతాప్రెడ్డి కూడా హరీశ్రావు పక్కనే ఉన్నా ఏమీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కొందరు అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా యత్నిస్తుండటాన్ని మానుకోవాలని సూచించారు. వెంకట్రామిరెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ పోటీ నుంచి తప్పుకోకుంటే పోలింగ్ నాటికి ఆయన చిట్టా ప్రజలు ముందు ఉంచుతామని హెచ్చరించారు. ఆయన చేసిన ప్రజా వ్యతిరేక పనులన్నీ ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనర్సింహకు తెలుసు కాబట్టే ఆయన సహాయంతో ముందుకు సాగుతున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు గ్యారంటీలకు ‘భట్టి’ భరోసా
[ 26-07-2024]
ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు గట్టి భరోసా ఇచ్చింది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. అతివలకు అండగా నిలవనుంది. పేదలకు సొంతగూడు కల్పించేలా నిధులు కేటాయించింది. -
పథకాలకు ‘భట్టి’ పద్దు.. సంక్షేమ పొద్దు
[ 26-07-2024]
ఆరు గ్యారంటీలు.. ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. ప్రజాపాలన, ప్రగతికి పెద్దపీట వేసింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి తొలి పద్దు.. -
సంక్షేమ పథం.. హలధారికి అందలం
[ 26-07-2024]
అన్నదాతలు మురిసేలా.. మహిళా సాధికారతకు బాటలు పడేలా.. యువత ఉపాధికి అవకాశాలు మెరుగయ్యేలా.. బడ్జెట్లో అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని జిల్లాప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బడ్జెట్పై నేతల స్పందన..
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆరు గ్యారంటీల ఊసే లేదని భాజపా జిల్లా అధ్యక్షురాలు సి.గోదావరి అంజిరెడ్డి విమర్శించారు. జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంటూ సంగారెడ్డి పట్టణ ప్రధాన రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. -
ఆగస్టులో ఆటలకు సై
[ 26-07-2024]
విద్యార్థి దశ నుంచే ఆటలపై ఆసక్తి పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. -
చేదోడుగా ఉంటారనుకుంటే.. చేజారిపోయారా
[ 26-07-2024]
వారంతా ఇరవై ఏళ్లకు పైబడిన యువకులు. విధులకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఎదిగిన బిడ్డలు కుటుంబాలకు చేదోడుగా ఉంటారని భావించిన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. -
సంచికి దూరం.. సృజనాత్మకతకు దోహదం
[ 26-07-2024]
చదువు భారంగా మారొద్దు.. భావితరానికి బాటలు వేయాలి. కిలోల కొద్దీ బరువుతో కూడిన సంచులు.. విద్యార్థిని ఒకింత ఆందోళనకు గురిచేస్తుంటాయి. శారీరక ఎదుగుదలపై కొంత ప్రభావం చూపుతుంది. -
తప్పుడు పత్రాలు సృష్టించిన ఆరుగురిపై కేసు
[ 26-07-2024]
తప్పుడు పత్రాలు సృష్టించి స్థలాన్ని కాజేయాలని చూసిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట వన్టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. -
విధులకు వెళుతూ అనంతలోకాలకు..
[ 26-07-2024]
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం తున్కిల్లతండా శివారులో సంగారెడ్డి-నాందేడ్ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. -
రైలు ప్రయాణికుడికి తప్పిన ప్రాణాపాయం
[ 26-07-2024]
కదులుతున్న రైల్లోకి పరుగెత్తుతూ ఎక్కబోయి పట్టు తప్పి దానికింద పడిపోబోయాడు ఓ ప్రయాణికుడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే రక్షణ దళం పోలీసు వెంటనే స్పందించి అతడిని రక్షించి ఆపద్బాంధవుడిగా మారాడు. -
స్వామి సరే.. అమ్మవార్ల మాటేమిటి!
[ 26-07-2024]
భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్న గర్భగుడిలో స్వామికి ఇరువైపులా బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలు కొలువై ఉన్నారు. ఏటా రూ.18 కోట్లకు పైగా వార్షిక ఆదాయం సమకూరుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్