ఎన్నికల విధులెక్కడో.. ఓటక్కడే!
ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడాన్ని బాధ్యతగా భావించాలి. ప్రతి ఒక్కరు పోలింగ్కు కదలాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది.
న్యూస్టుడే, నారాయణఖేడ్ టౌన్: ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడాన్ని బాధ్యతగా భావించాలి. ప్రతి ఒక్కరు పోలింగ్కు కదలాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. సాధారణ ప్రజలే కాకుండా పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బంది సైతం ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటోంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓటుహక్కు కలిగి ఉండి.. మరో చోట ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది. ఎన్నికల విధులు నిర్వర్తించే చోట లేదా ఓటు హక్కు కలిగిన ప్రాంతంలో ఓటు చేయడానికి అధికారులు ఈడీసీ(ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్) ద్వారా అవకాశం కల్పిస్తున్నారు..
అవకాశం ఎలాగంటే..
లోక్సభ స్థానంలోని ఏ పోలింగ్ కేంద్రంలోనైనా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఈడీసీ ద్వారా ఓటేయవచ్చు. ఉదాహరణకు నారాయణఖేడ్ పట్టణంలో ఓటుహక్కు ఉన్న ఉద్యోగి అందోలు పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తించాల్సి వస్తే.. ఈడీసీ ద్వారా అక్కడ ఓటేయొచ్చు. నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాలు జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి. అదే ఉద్యోగి మెదక్ జిల్లాలో విధులు చేపడితే.. అక్కడ ఓటేసే అవకాశం ఉండదు. ఎందుకంటే లోక్సభ స్థానం మారుతుంది. ఆ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులతోపాటు సూక్ష్మ పరిశీలకులు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. వీరందరూ ఈడీసీ లేదా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది.
ఫారం 12ఏ సమర్పించాలి
ఈడీసీ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునేవారు ఫారం-12ఏను తప్పులు లేకుండా పూరించి, ఎన్నికల విధుల వివరాలు జతపరిచి సంబంధిత సహాయక రిటర్నింగ్ అధికారి(ఏఆర్వో)కి అందించాలి. ఎఆర్వో పరిశీలించి రిటర్నింగ్ అధికారికి పంపిస్తారు. అన్ని అంశాలు సరిగ్గా ఉన్నాయని ధ్రువీకరించుకున్నాక రిటర్నింగ్ అధికారి ఈడీసీ జారీ చేస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లాల్లో కలిపి 21,381 మంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 8363 మంది ఎన్నకల విధుల్లో భాగస్వాములవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.