అవగాహన లేక.. ముందుకు రాక
మత్స్యకార సంఘాల బలోపేతానికి ఉపాధి హామీ పథకం తోడ్పాటు అందిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు బీడు భూములను సేద్యంలోకి తీసుకురావడం, నీటి వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ,
కేంద్ర పథకాన్ని వినియోగించుకోని మత్స్యకారులు
మెదక్ టౌన్, న్యూస్టుడే: మత్స్యకార సంఘాల బలోపేతానికి ఉపాధి హామీ పథకం తోడ్పాటు అందిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు బీడు భూములను సేద్యంలోకి తీసుకురావడం, నీటి వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సాగు రంగానికి అవసరమైన వనరులను తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కాగా...తాజాగా మత్స్యకార సంఘాల పేరిట చేపల పెంపకానికి గుంతలు తీసే పనులను చేపడుతోంది. కానీ ఈ విషయంపై జిల్లాలోని మత్స్యకారులకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించకపోవడంతో ఈ పథకానికి దూరమవుతున్నారు.
నాలుగు రకాల కుంటలు
జిల్లాలోని ఆయా గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ చెరువులు, కుంటలు, చెరువు శిఖం, మత్స్య సహకార సంఘాల పేరిట ఉన్న భూముల్లో ఈ కుంటలను నిర్మిస్తారు. వీటిలో చేపల తయారీకి ఉపయోగకరంగా నాలుగు రకాలుగా కుంటలు నిర్మిస్తారు. ఒక్కో దానిలో సుమారుగా 20 వేల వరకు చేపలు పెరిగేలా నిర్మాణాలు చేపడుతారు. ఉపాధి కూలీల ద్వారా చేయించే ఈ పనులకు ఒక్కో కుంట నిర్మాణానికి రూ.8-9 లక్షల వరకు వెచ్చిస్తారు.
మూడేళ్లు అవుతున్నా..
ప్రధాన మంత్రి మత్స్యయోజన పథకాన్ని(పీఎంఎంవైఎస్) చేపల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభమై మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు జిల్లాలో ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు. చాలా వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు నిరక్షరాస్యులు కావడంతో ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలపై అంతగా అవగాహన ఉండదు. ఈ పథకాలు క్షేత్ర స్థాయిలోకి వెళ్లడంతో పాటు మత్స్యకారులకు అవగాహన కల్పించడంలో సంబంధిత శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మంచి లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం నిరుపయోగంగా మారుతుంది.
జీవనోపాధికి ఉపయుక్తం
- శ్రీనివాస్, డీఆర్డీవో
మత్స్య కార్మికులకు జీవనోపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కానీ జిల్లాలోని మత్స్యకారులు ఈ పథకానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇంతవరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ పథకంలో కుంటలు నిర్మించుకునేందుకు రూ.8-10 లక్షల వరకు ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్య సహకార సంఘాలు: 283
సభ్యులు: 18507
పురుషుల సంఘాలు: 261
సభ్యులు: 17482
మహిళా సంఘాలు: 22
సభ్యులు: 1025
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?