జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు.
నామపత్రాలు అందజేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్, చిత్రంలో మంత్రి దామోదర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ తదితరులు
సంగారెడ్డి టౌన్, న్యూస్టుడే: జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఆయన వెంట ఉన్నారు. భారాస అభ్యర్థి గాలి అనిల్కుమార్.. మాజీ మంత్రి హరీశ్రావు, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీతో కలిసి వచ్చి నామినేషన్ పత్రాలు అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి దేవ శిఖమని, రాష్ట్ర సామాన్య ప్రజల పార్టీ అభ్యర్థి మున్వర్ హుసేన్, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి బాల్రాజ్, స్వతంత్ర అభ్యర్థులు అశోక్, జైపాల్ నాయక్, రమేశ్, యాకుబ్ షరీఫ్, మాణయ్య నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణికి సమర్పించారు.
మెదక్ పార్లమెంట్ స్థానానికి..
మెదక్: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు దాఖలు చేశారు. నర్సాపూర్, పటాన్చెరు ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, మహిపాల్రెడ్డి, మెదక్ జడ్పీ అధ్యక్షురాలు హేమలత, మున్సిపల్ మాజీ ఛైర్మన్ భట్టి జగపతితో కలిసి ఒక సెట్, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్తో కలిసి మరో సెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మదన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకురాలు సుహాసినిరెడ్డితో కలిసి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు ఆయన కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు రమేశ్, ప్రదీప్కుమార్, ఆంజనేయులు, నరహరి, భానుచందర్, యుగతులసీ పార్టీ అభ్యర్థి అనిల్ మొదటి సెట్ నామినేషన్ వేయగా, ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్, విముక్తి చిరుతల కక్షి పార్టీ అభ్యర్థి ఎల్లయ్య, స్వతంత్ర అభ్యర్థులు లక్ష్మినారాయణ, నవీన్ మరో సెట్ నామపత్రాలు సమర్పించారు.
జహీరాబాద్: సంగారెడ్డిలో బుధవారం జరిగిన కాంగ్రెస్ అభ్యర్థి సురేష్షెట్కార్ నామినేషన్ కార్యక్రమానికి జహీరాబాద్ నుంచి ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. పార్టీ నియోజకవర్గ ఛీఫ్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు.
నేడు తుది గడువు
నామపత్రాల దాఖలుకు గురువారం తుది గడువు. ఇప్పటి వరకు మెదక్ పార్లమెంట్ స్థానానికి 33 మంది అభ్యర్థులు 55 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రధాన పార్టీలైన భాజపా అభ్యర్థి రఘునందన్రావు, భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ వేశారు. వీరితో పాటు ఆయా పార్టీల తరఫున పలువురు, స్వతంత్ర అభ్యర్థులుగా మరికొందరు నామినేషన్ దాఖలు చేశారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ వేయడానికి అవకాశం ఉంది. వచ్చిన నామినేషన్లను ఈనెల 26న పరిశీలించనున్నారు. 29 వరకు ఉప సంహరణకు గడువు విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ