ఖర్చు మించితే.. అనర్హతే
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు.
ప్రచారంలో ప్రతి దానికీ పక్కా లెక్క
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం సూచించిన దాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వెచ్చిస్తుంటారు. వ్యయ పరిమితి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ఖర్చు, తదితర అంశాలపై కథనం.
న్యూస్టుడే, చేగుంట, తాండూరు: గత శాసనసభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి అనధికారికంగా సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ సారి లోక్సభ ఎన్నికల్లో వివిధ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా.. నామినేషన్ ప్రక్రియ సైతం చివరి దశకు చేరింది. ప్రచారాలు ఊపందుకున్నాయి. దీంతో ఖర్చులు సైతం ప్రారంభమయ్యాయి. సభలు, ర్యాలీలు, భోజనాలు, వాహనాలు తదితర వాటికి వెచ్చించక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు హద్దులు దాటకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను నిర్దేశించింది. వీటిని పక్కాగా అమలు చేసేలా ప్రత్యేక తనిఖీ బృందాలను సైతం నియమించింది. వీరు నిత్యం పరిశీలిస్తూ ఖర్చు లెక్కిస్తారు. హద్దు దాటితే అనర్హత పడే అవకాశం లేకపోలేదు.
రూ.95 లక్షల పరిమితి..
లోక్సభ అభ్యర్థుల వ్యయ పరిమితి రూ. 95 లక్షలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. అభ్యర్థులు ప్రచారం నిమిత్తం ఇంత కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. పరిమితి దాటి ఖర్చు చేసినా, వాటికి సంబంధించిన లెక్కలను సరైన ఆధారాలతో సమర్పించకున్నా వేటు పడక తప్పదు. నామపత్రాలు దాఖలు చేసినప్పటి నుంచి ఖర్చు లెక్కిస్తారు. అభ్యర్థి ఏదైనా జాతీయ బ్యాంకులో కొత్త ఖాతా తెరిచి లావాదేవీలు నిర్వహించాలి. నామినేషన్కు ముందు అభ[్యర్థులు చేపట్టిన ప్రచారాలు, సభలు, ఇతర కార్యక్రమాల ఖర్చులను సంబంధిత పార్టీ ఖర్చు కింద జమచేస్తారు.
ఎన్నికల్లో ప్రలోభాల నియంత్రణకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు స్టాటిక్ సర్వైలెన్స్, వీడి సర్వైలెన్స్, వీడియో వీవింగ్, ఎంసీసీ బృందాలను నియమించారు. ఆయా బృందాల సభ్యులు అన్నింటిపై నిఘా పెట్టారు. అభ్యర్థుల వెంట షాడో బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను చిత్రీకరిస్తున్నారు. అభ్యర్థుల ఖర్చులను వ్యయ బృందాలు తనిఖీ చేసి ఏమైనా వ్యత్యాసాలు ఉంటే నోటీసులు జారీ చేస్తాయి.
30 రోజుల్లోగా సమర్పించాలి..
ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు పోటీ చేసిన ప్రతి ఒక్కరూ తమ ఖర్చు వివరాలను బిల్లులతో సహా అధికారులకు అప్పగించాలి. పరిమితికి మించి ఖర్చు చేసినా వ్యయానికి సంబంధించిన లెక్కలను నిర్దేశించిన సమయంలో చూపకున్నా వేటు పడటం ఖాయం. తర్వాతి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే అభ్యర్థులు జాగ్రత్తగా ఖర్చు చేస్తూ వివరాలను సమర్పించాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం