మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం,
ఇద్దరు నిందితుల రిమాండ్
వివరాలు వెల్లడిస్తున్న జహీరాబాద్ సీఐ రవి
న్యూస్టుడే, జహీరాబాద్ అర్బన్, కోహీర్: డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, లేదంటే, ఎలా బతుకుతారో అంటూ యువకులను భయపెట్టి దాడి చేయడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. జహీరాబాద్ పట్టణ సర్కిల్ కార్యాలయంలో బుధవారం సీఐ రాజబోయిన రవి తెలిపిన ప్రకారం హత్యకు గురైన హైదరాబాద్లోని ఎల్లమ్మబండ ప్రాంతానికి చెందిన షేఖ్ అన్వర్అలీ అలియాస్ హనీసింగ్(30), కోహీర్ మండలం రాజనెల్లికి చెందిన ముస్తఖీమ్(22), కోహీర్ నల్సావాడికి చెందిన మహ్మద్ కైౖఫ్(24) కొంతకాలం జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఆటోడ్రైవర్లు కలిసి పనిచేశారు. ముస్తఖీమ్, మహ్మద్ కైౖఫ్లకు షేఖ్ అన్వర్అలీ తన మామా వద్ద ఆటోలను అద్దెకు ఇప్పించేవాడు. అద్దె రూ.1000 వసూలు చేసి రూ.600 యజమానికి ఇచ్చి రూ.400 కమీషన్ తీసుకునేవాడు. దీంతో పాటు దుర్భాషలాడుతూ రాత్రి వేళల్లో వారిని చోరీలకు తీసుకెళ్లేవాడు. అన్వర్అలీ ప్రవర్తన నచ్చకపోవడంతో ముస్తఖీమ్, మహ్మద్ కైౖఫ్ సొంతూళ్లకు వచ్చి ఆటోడ్రైవర్లుగా జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలోనే అన్వర్ తరుచూ ఫోన్ చేసి మళ్లీ హైదరాబాద్ వచ్చేయండి చోరీలు చేద్దాం. లేదంటే ఆటో అద్దె బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తు వచ్చాడు. జహీరాబాద్కు వస్తా నాలుగు ద్విచక్ర వాహనాలు అపహరించి ఇవ్వాలని షరతూ విధించాడు. లేదంటే మీ అంతు చూస్తానని బెదిరించాడు. హైదరాబాద్ నుంచి కోహీర్ వచ్చిన అలీతో మంగళవారం రాత్రి ప్రభుత్వ పాఠశాల వెనక కూర్చుని మాట్లాడుతుండగా గొడవ జరిగింది. వెంట తెచ్చుకున్న వేట కొడవలితో ముస్తఖీమ్పై అన్వర్అలీ దాడికి యత్నించగా, ముస్తఖీమ్, కైఫ్ కలిసి ఎదురుదాడి చేసి అతన్ని అంతమొందించారు. అదే రోజు నిందితుల్లో ఒకరు ఠాణాలో లొంగిపోయాడు. మరొకరిని బుధవారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిని త్వరగా పట్టుకుని రిమాండ్కు తరలించడంలో కృషి చేసిన ఎస్సై విఠల్, సిబ్బంది శ్రీనివాస్, సుధాకర్ను సీఐ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్