logo

కాంగ్రెస్‌లో చేరిన విగ్రాం శ్రీనివాస్‌గౌడ్‌

పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్‌ నాయకుడు, కేంద్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ విగ్రాం శ్రీనివాస్‌గౌడ్‌ బుధవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

Updated : 25 Apr 2024 06:31 IST

పెద్దశంకరంపేట, న్యూస్‌టుడే: పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్‌ నాయకుడు, కేంద్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ విగ్రాం శ్రీనివాస్‌గౌడ్‌ బుధవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డిలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌శెట్కార్‌, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి దామోదర్‌ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని