ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు
గజ్వేల్, పటాన్చెరుపై దృష్టి
న్యూస్టుడే, గజ్వేల్, మెదక్, పటాన్చెరు: పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల వారీగా బలాబలాలపై అంచనా వేస్తూ ప్రచారానికి పథక రచన చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలున్న చోట కంటే పార్టీకి బలం లేని చోట ఎక్కువగా శ్రమ పడాలని బూతు స్థాయిలో కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు. ఇప్పటికే సెగ్మెంట్ల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన భారాస, భాజపా, కాంగ్రెస్ ప్రస్తుతం రోడ్షోలు, సెగ్మెంట్లలో స్థానిక నేతల ద్వారా ప్రచారం హోరెత్తించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మెదక్ పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 18,19,397 మంది ఓటర్లున్నారు. ఇందులో అత్యధికంగా పటాన్చెరులో 4,10,609 మంది ఓటర్లుండగా తరువాత గజ్వేల్లో 2,79,868 మంది ఓటర్లున్నారు. పార్టీల చూపు ఎక్కువగా ఈ రెండు నియోజకవర్గాలపైన నేతలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2009తోపాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మెదక్ స్థానం భారాస ఖాతాలోనే ఉంది. ఇప్పుడు మరోమారు గెలిచితీరాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్, భాజపా నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.
గత ఎన్నికల్లో..: 2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానంతోపాటు మెదక్ పార్లమెంటుకు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ 6,57,429 ఓట్లు (55.20శాతం) సాధించి 3,97,029 ఓట్ల ఆదిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్కుమార్రెడ్డికి 21.87 శాతం, భాజపా అభ్యర్థి నరేంద్రనాథ్కు 15.25 శాతం ఓట్లు వచ్చాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్రెడ్డి 3,61,277 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2019 ఎన్నికల్లో భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి 5,96,048 ఓట్లు (51.82 శాతం) వచ్చాయి. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన గాలి అనిల్కుమార్కు 2,79621 ఓట్లు (24.31 శాతం) వచ్చాయి. భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన (ప్రస్తుత భాజపా అభ్యర్థి) రఘునందన్రావుకు 2,01,567 ఓట్లు (17.52 శాతం) వచ్చాయి.
పరపతితో ముందుకు..: ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో గెలవాలని పట్టుదలతో ఉంది. ప్రచారశైలిని మార్చుకుంటూ మూడు పార్టీల నేతలు ముందుకు దూసుకెళ్తున్నారు. గజ్వేల్ స్థానిక నేత మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పార్టీ బాధ్యతల్లో ఉండటంతో గజ్వేల్లో ఓట్లు ఎక్కువగా వస్తాయని నేతలు ధీమాతో ఉన్నారు. భారాస నేత ప్రతాప్రెడ్డి తన పరపతితో ఓట్ల శాతం పెంచడానికి కృషి చేస్తున్నారు. గజ్వేల్ పట్టణానికి చెందిన వంటేరు యాదవరెడ్డి భారాస ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గజ్వేల్లో అధిక శాతం ఓట్లు సాధిస్తే కేసీఆర్ దృష్టిలో పడి పేరు పొందొచ్చని ఆయన వ్యూహరచనలో ఉన్నారు. పటాన్చెరులో స్థానిక భారాస ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నియోజకవర్గం పటాన్చెరు కావటంతో ఆయన ప్రత్యేక దృష్టిసారించి ప్రచారం కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం