గ్రామ మణిపూసలు
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు.
జువేరియానాజ్ 979
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. తల్లిదండ్రులు జమ్రుద్ బేగం, ఎండీ అబ్దుల్ జబ్బార్. తండ్రి పౌల్ట్రీఫాంలో అకౌంటెంట్గా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉన్న జువేరియానాజ్ లక్ష్యం వైద్యురాలు కావడమే. నిత్యం కళాశాలకు హాజరైన విద్యార్థిని ఏరోజుకారోజు పాఠ్యాంశాలను ఔపోసన పట్టారు. రోజులో 14 గంటలు చదువుకు కేటాయించారు. నీట్కు సిద్ధమవుతున్నారు.
- న్యూస్టుడే, సిద్దిపేట
అధ్యాపకుల మార్గనిర్దేశంతో..
శిరీష
జహీరాబాద్ మండలం రంజోల్ బాలికల సాంఘీక సంక్షేమ గురుకులానికి చెందిన శిరీష బైపీసీలో సత్తా చాటారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శిరీష తల్లిదండ్రుల కష్టాన్ని చూసి బాగా చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉత్తమ మార్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగారు. అధ్యాపకుల మార్గనిర్దేశంతో పాఠ్యాంశాలను పక్కాగా వల్లెవేశారు. ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఫలితాన్ని అందుకున్నారు.
- న్యూస్టుడే, జహీరాబాద్ అర్బన్
త్రల్లి కష్టాన్ని చూసి..పింకి
982
జహీరాబాద్ మండలం రంజోల్ బాలికల సాంఘీక సంక్షేమ గురుకులానికి చెందిన పింకి అత్యున్నత మార్కులు సాధించారు. ఈ విద్యార్థిని స్వగ్రామం మొగుడంపల్లి మండలం నందునాయక్తండా. పింకి బాల్యంలో ఉన్నప్పుడే తండ్రిని కొల్పోయారు. అప్పటి నుంచి తల్లి రేణుక కుటుంబ భారాన్ని మోస్తున్నారు. వివిధ పనులు చేసుకుంటూ కుమార్తెను చదివిస్తున్నారు. తల్లి కష్టాన్ని చూసిన పింకి ఉన్నత కొలువు సాధించాలనే పట్టుదలతో చదివారు. తాను అనుకున్నది సాధించారు.
- న్యూస్టుడే, జహీరాబాద్ అర్బన్
వ్యవసాయ కుటుంబం
సంతోష 985
సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని సంతోష ఎంపీసీలో ప్రతిభ చాటారు. స్వగ్రామం తొగుట మండలం వెంకట్రావుపేట. తల్లిదండ్రులు లక్ష్మి, కనకయ్య. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారం. ఇంటర్ ప్రథమలో 462 మార్కులు వచ్చాయి. ద్వితీయ సంత్సరంలో నిత్యం 12 గంటల పాటు శ్రమించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో జరిగిన ప్రత్యేక తరగతులు కలిసొచ్చాయి. ప్రస్తుతం ఎంసెట్ శిక్షణ పొందుతున్నారు. ఇంజినీరుగా స్థిరపడటమే లక్ష్యం.
- న్యూస్టుడే, సిద్దిపేట అర్బన్
మధ్యలో ఆపేసి.. పుంజుకొని..
అనూష
988
దోమ మండలం బట్లసందారానికి చెందిన నర్సమ్మ, మొగులయ్య దంపతుల పెద్ద కుమార్తె అనూష స్వగ్రామంలో పదో తరగతి వరకు చదివారు. వ్యవసాయ కుటుంబం కాగా, రెండేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మొగులయ్య ఇంంట్లోనే ఉంటున్నాడు. అప్పటినుంచి తల్లి అన్నీ తానై రెండెకరానలు సాగుచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మొదట్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనే చదువు నిలిపివేయగా.. కళాశాల ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో మళ్లీ చేరి చదువుకున్నారు.
- న్యూస్టుడే, కొడంగల్
డ్రైవర్ కుమార్తె..
మౌనిక
981
కల్హేర్ మండలం ఫతేనగర్కు చెందిన జయరాజ్ డ్రైవరుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తల్లి అనిత గృహిణి. వీరి కుమార్తె మౌనిక స్వగ్రామంలో పది వరకు విద్యాభ్యాసం పూర్తిచేశారు. అనంతరం ఝరాసంగంలోని ఫులే కళాశాలలో బైపీసీలో ఇంటర్ చదివారు. ఉత్తమ మార్కులతో అదరగొట్టారు. కళాశాల అధ్యాపకుల సూచనలతో నిత్యం 10 గంటల పాటు శ్రమించి చదివారు. ఏ రోజుకారోజు పాఠ్యాంశాలను వల్లెవేస్తూ ముందుకు సాగి ఉత్తమ మార్కులు సాధించారు.
- న్యూస్టుడే, ఝరాసంగం
ఆర్టీసీ బస్సులో వచ్చి వెళ్తూ..
పూడూరు మండలం ఎన్కెపల్లి ఆదర్శ కళాశాలకు చెందిన ఎంపీసీ ద్వితీయ విద్యార్థిని అరుంధతి రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. ఇదే మండలం చింతలపల్లికి చెందిన పుష్పలత, చంద్రశేఖర్గౌడ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పుష్పలత వ్యవసాయ కూలీగా, చంద్రశేఖర్గౌడ్ ఓ షాపింగ్ మాల్లో పని చేస్తున్నారు. వీరి చిన్న కుమార్తె అరుంధతి చింతలపల్లి గ్రామం నుంచి కళాశాలకు 16 కి.మీ. దూరం ఉంటుంది. నిత్యం ఆర్టీసీ బస్సులో వచ్చి వెళ్తూ చదువుకున్నారు. అధ్యాపకుల ప్రోత్సహించారు.
- న్యూస్టుడే, పూడూరు
ప్రణాళికతో అడుగేసి..
ఇంటర్ బైపీసీ ద్వితీయలో 981 సాధించారు శ్వేత. ఈమె తల్లిదండ్రులు రాధ, రాచప్ప. వ్యవసాయమే జీవనాధారం. కర్ణాటకలోని గుల్బార్గా వెంకటాపూర్ స్వగ్రామం. వైద్యురాలిగా స్థిరపడాలనే ధ్యేయంతో బైపీసీలో చేరారు.
తల్లిదండ్రులకు చేదోడుగా..
గజ్వేల్లోని బాలికల విద్యాసౌధంలోని వసతిగృహంలో ఉంటూ ఆదర్శ కళాశాలలో ఎంపీసీ చదివిన శైలజ ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు రేణుక, ప్రభాకర్. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి వారికి చేదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా కష్టపడి చదివారు. నిత్యం పాఠాలు విని వసతిగృహానికి రాగానే తిరిగి చదువుకోవడం ఈమెకున్న అలవాటు.
- న్యూస్టుడే, గజ్వేల్ గ్రామీణ
పేదరికాన్ని జయించి..
సాయి వైష్ణవి
983
తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన బండకాడి సుధ, సత్యనారాయణ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె సాయి వైష్ణవి గజ్వేల్లోని బంధువుల ఇంట్లో ఉంటూ స్థానిక మోడల్ కళాశాలలో బైపీసీ చదివారు. సత్యనారాయణ రికార్డింగ్ స్టూడియోలో పని చేస్తుండగా, సుధ మహిళా సంఘం సీఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమ పిల్లలను ప్రయోజకులను చేయాలన్న ఉద్దేశంతో పేదరికాన్ని దరిచేరనీయకుండా వారిని చదివించగా.. సాయివైష్ణవి తానేంటో నిరూపించుకున్నారు.
-న్యూస్టుడే, గజ్వేల్ గ్రామీణ
అమ్మానాన్నల ప్రోత్సాహంతో..
సయ్యద అస్పియా హస్మీ
990
తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన సయ్యద అస్పియా హస్మీ బైపీసీ ద్వితీయ (ఉర్దూ)లో ఉత్తమ మార్కులతో కళాశాలలో టాపర్గా నిలిచారు. తల్లిదండ్రులు సఫియా, సయ్యద్ సులేమాన్ హస్మీ. వైద్యురాలు కావాలన్న లక్ష్యంతో ఇంటర్లో బైపీసీని ఎంచుకున్నారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో శ్రమించారు. కళాశాల అధ్యాపకులు బోధించిన పాఠ్యాంశాలను ఏ రోజుకారోజు మననం చేసుకుంటూ, అనుమానాలను వెంటనే నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగారు.
- న్యూస్టుడే, తాండూరు
ప్రణాళికాబద్ధంగా..
సాయి వైష్ణవి
988
ప్రణాళికాబద్ధంగా చదివి సత్తా చాటారు ఎంపీసీ విద్యార్థిని అక్షయ. వికారాబాద్లోని లక్ష్మిబాయి గురుకులంలో ఇంటర్ చదివిన ఈ విద్యార్థిని తల్లిదండ్రులు కృష్ణవేణి, మహేందర్రెడ్డి. తండ్రి డ్రైవరుగా, తల్లి దుస్తుల దుకాణంలో పని చేస్తున్నారు. వీరిది పేద కుటుంబం కాగా, షామీర్పేటలో నివాసం ఉంటున్నారు. ఇంజినీర్ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా చదివారు. తల్లిదండ్రులుప్రోత్సహించడంతో ఉత్తమ మార్కులు సాధించారు.
- న్యూస్టుడే, వికారాబాద్ కలెక్టరేట్
దుబ్బాక: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ఎలక్టిక్రల్ టెక్నీషియన్ చదివిన సుకుమార్ 994 మార్కులు సాధించారు.
నారాయణఖేడ్ రూరల్: నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని బైజా సభా బైపీసీ ప్రథమలో 437 మార్కులు సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు