అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తేజోవనం ముఖద్వారం
కొండపాక గ్రామీణం, న్యూస్టుడే: కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఇక్కడ 3.20 లక్షల మొక్కలను రాబోయే కాలంలో నాటేందుకు సిద్ధం చేశారు. హరితనిధి కింద పెంచుతున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఈ పార్కులో జింకలు, కొండగొర్రెలు, దుప్పులు, నక్కలు, అడవిపందులు, నెమళ్లు, వివిధ రకాల పక్షి జాతులు ఉన్నాయి. పార్కు నిర్దేశిత ప్రాంతం చుట్టూ ఇనుప కంచె నిర్మించి వృక్షాలు, మొక్కలు, జంతువులు, పక్షులను సంరక్షిస్తున్నారు. ఇక్కడికి నెలకు సుమారు 3 వేల మంది సందర్శకులు వస్తున్నారు. అన్నిరకాల ఆదాయం నెలకు రూ.50 వేలకు పైగా వస్తోంది. సందర్శకుల కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.
ఉద్యానం మధ్యలో వాచ్ టవర్
సకల సౌకర్యాలతో.. పర్యాటకులు తిరిగి చూసేందుకు అందుబాటులో 10 సైకిళ్లు ఉన్నాయి. ఒకే చోట 16 మంది కూర్చొని సేద తీరేందుకు ‘గెజిబో సీటింగ్’ నిర్మించారు. అర ఎకరా విస్తీర్ణంలో కర్రలతో తయారుచేసిన సమావేశం మందిరం ఉంది. చిన్న కాల్వలపై కృత్రిమ వంతెనలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు మూడు సోలార్ పంపు సెట్లు అమర్చారు. 9 కి.మీ మేర నడకదారి, 11 కి.మీ సైక్లింగ్ దారులు నిర్మించారు. రాశుల వనం నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వ్యాయామం చేసుకోవటానికి పరికరాలతో ఏర్పాట్లు ఉన్నాయి. మూడంతస్తుల వాచ్ టవర్తో పరిసరాలను చూడవచ్చు. మియావాకీ పద్ధతిలో పండ్లు, పూలు, ఔషధ మొక్కలను పది వేలకు పైగా పెంచుతున్నారు.
వేసవి సెలవుల్లో పిల్లలతో కలసి వీక్షించొచ్చు
ఇక్రమొద్దీన్, ఎఫ్ఆర్వో, సిద్దిపేట
వేసవి సెలవుల్లో పిల్లలతో కలసి కుటుంబసభ్యులందరూ తేజోవనం పార్కును సందర్శించి పార్కులోని ప్రకృతి సహజ అందాలను వీక్షించొచ్చు. సెలవు రోజులు మినహా ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రోజంతా పార్కులో హాయిగా తిరగొచ్చు. పెద్దలకు రూ.30, పిల్లలకు రూ.20 చొప్పున ప్రవేశరుసుం ఉంది. తాగునీరు, శౌచాలయాల వసతి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్