ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది.
మూడేళ్ల క్రితం ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో 2,623 శౌచాలయాల నిర్మాణాలు
1,280కి చెల్లింపులు పూర్తి
అక్కన్నపేట మండలం కుందన్వానిపల్లిలో నిర్మించిన వ్యక్తిగత శౌచాలయం
న్యూస్టుడే, హుస్నాబాద్ గ్రామీణం: గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. వివరాల్లోకి వెళితే... స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా మూడేళ్ల క్రితం ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పచ్చదనంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. అప్పట్లో ఈ శౌచాలయాల నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమం మాదిరిగా చేపట్టాయి. జిల్లా ఉన్నతాధికారులు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు వీటి నిర్మాణం, ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటా నిర్మించుకునేలా చేశారు. నిర్ణీత గడువులోగా నిర్మించుకున్న మరుగుదొడ్లకు ఒక్కో శౌచాలయానికి రూ.12వేల చొప్పున బిల్లులు చెల్లించారు.
జిల్లాలో 2,777 మంది లబ్ధిదారులు
కొన్నింటికి బిల్లులు చెల్లించలేదు. అలాంటివి జిల్లాలో 2,777 శౌచాలయాలు ఉన్నాయి. అప్పటినుంచి లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాటి బిల్లులు చెల్లింపు జరుగుతోంది. అప్పట్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు మంజూరై ఉండాలి. మరుగుదొడ్డి నిర్మించుకుని ప్రస్తుతం వినియోగంలో ఉన్న వారికి బిల్లులు చెల్లిస్తున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలనతో.
అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే చెల్లిస్తున్నారు. లబ్ధిదారుడి పేరు, శౌచాలయం మంజూరైందా లేదా... ఎప్పుడు నిర్మించుకున్నారు. పూర్తయిందా లేదా. దానిని వినియోగిస్తున్నారా లేదా అనే వివరాలను పరిశీలించాలి. ఫొటో తీయాలి. బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలి. వీటన్నింటిని ఎంపీడీవో ద్వారా డీఆర్డీవో కార్యాలయానికి పంపిస్తున్నారు. అక్కడి నుంచి వాటిని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,623 శౌచాలయాలు పూర్తయినట్లు క్షేత్రస్థాయి అధికారుల సర్వేలో తేలింది. వాటిలో 2,108 శౌచాలయాలకు బిల్లుల చెల్లింపుకు ఎంపీడీవోలు డీఆర్డీవో కార్యాలయానికి పంపించారు. వాటిని పరిశీలించిన జిల్లా అధికారులు వాటిలో 1280 శౌచాలయాలకు మాత్రమే బిల్లులు చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ మేరకు వాటికి ప్రభుత్వం రూ.1.49 కోట్ల బిల్లులను లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఈ మేరకు వారి ఖాతాల్లో డబ్బులు జమవుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. చాలా రోజుల తర్వాత బిల్లులు రావడంతో లబ్దీదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత