బడులకు భద్రతేది?
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది.
చోరీకి గురవుతున్న విలువైన వస్తువులు
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. నిత్యం పశువులు, పందులు బడి ఆవరణలో సంచరిస్తున్నాయి. రాత్రి వేళల్లో మందుబాబులు, జూదరులకు అడ్డాగా మారింది. వారి ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. ఈ బడిలోని వస్తువులు గతంలో చోరీకి గురయ్యాయి.
సంగారెడ్డి పట్టణం బాబానగర్లోని పోలీస్ లైన్ పాఠశాల ఇది. ప్రహరీ లేకపోవడంతో భద్రత కరవైంది. పాఠశాలలో విలువైన కంప్యూటర్లు, ఫర్నిచర్, పరికరాలు ఉన్నాయి. నిత్యం రాత్రివేళ కొందరు ఆకతాయిలు ఇక్కడికి చేరి మద్యం తాగుతున్నారు. కుళాయిలు, తలుపులు, ఇతర వస్తువులు విరగ్గొడుతున్నారు. ప్రహరీకి నిధులు మంజూరైనా పనులు చేపట్టలేదు.
న్యూస్టుడే, ఇస్మాయిల్ఖాన్పేట(సంగారెడ్డి మున్సిపాలిటీ), జహీరాబాద్, గుమ్మడిదల, ఝరాసంగం, కోహీర్: ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ విలువైన కంప్యూటర్లు, డిజిటల్ తెరలు, గ్రంథాలయ పుస్తకాలు, యూపీఎస్ బ్యాటరీలు పంపిణీ చేసింది. కాపలాదారులు, ప్రహరీలు లేకపోవడంతో వీటికి భద్రత కరవైంది. కొన్ని చోట్ల ఆకతాయిలు పాఠశాలల్లోని విలువైన వస్తువులను చోరీ చేయడం, విరగ్గొట్టడం లాంటివి చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిలు పాఠ్య పుస్తకాలు, బల్లలకు నిప్పు పెట్టిన నేపథ్యంలో జిల్లాలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
క్షేత్ర పరిస్థితి..
- ఝరాసంగంలోని పాఠశాలలో మూడు నెలల క్రితం చోరీ జరిగింది. విలువైన పరికరాలు అపహరణకు గురయ్యాయి. మన ఊరు.. మన బడి కింద బర్దీపూర్ పాఠశాలను ఎంపిక చేసి పనులు చేపడుతున్నా.. పూర్తి కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న గుర్తు తెలియని వ్యక్తులు బడి తాళం విరగ్గొట్టి అంతర్జాలానికి సంబంధించిన పరికరాలు ఎత్తుకెళ్లారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు పక్క పక్కనే ఉంటాయి. రాత్రి కాపలాదారుని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
- కోహీర్ పట్టణంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలకు ప్రహరీలు లేవు. రాత్రి వేళల్లో ఆకతాయిలు అడ్డాగా మార్చుకుంటున్నారు. బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఇటీవల హత్య ఘటన వెలుగుచూసింది.
- గుమ్మడిదల ప్రభుత్వ పాఠశాలకు రక్షణ కరవైంది. ఈ మండల పరిధిలోని బొంతపల్లి మినహా అన్ని జడ్పీ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కానుకుంట జడ్పీ, ప్రాథమిక పాఠశాలల పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నాయి. భవనాలు శిథిలమయ్యాయి. ప్రహారీలు లేవు.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
పాఠశాలల్లో కాపలాదారుల పోస్టులు మంజురు కాలేదు. దీంతో నియమించలేకపోయాం. సెలవుల్లో కాపాలాదారులను నియమించాలని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తరచూ వెళ్లి పర్యవేక్షించాలి. గ్రామాల్లో పంచాయతీలు, పట్టణాల్లో పురపాలక సిబ్బంది పరిశీలన బాధ్యత తీసుకోవాలి. పాఠశాలలు అందరివి. వాటిలోని పరికరాలు సంరక్షించుకోవాలి.
వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు