తీరు మారదు.. కాలుష్యం వదలదు!
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు.
బ్యాంకు గ్యారంటీలు జప్తు చేసినా అంతే
పారిశ్రామిక వాడల్లో పరిస్థితి ఇది
ఇళ్ల ముందే పారుతున్న కాలుష్య జలం
న్యూస్టుడే, జిన్నారం: కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. ఈ 15 పరిశ్రమల్లో చాలావరకు పెద్దవే ఉన్నాయి. మరోవైపు కొన్ని పరిశ్రమలు నిబంధనలు పాటించకుండా వాన కురవగానే కాలుష్య జలాలను వాగుల్లో వదులుతున్న తీరును గుర్తించిన పీసీబీ హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు యథావిధిగా రసాయన వ్యర్థ జలాలను కాలువల్లోకి వదిలేయడం గమనార్హం. దీని ఫలితంగా నాలుగైదు రోజులుగా ఖాజీపల్లిలో రసాయనాల ఘాటు వెదజల్లుతోంది.
కఠిన చర్యలు శూన్యం: కాలుష్య నియంత్రణ మండలి ప్రతి వర్షాకాలానికి ముందు ఏయే పరిశ్రమల్లో ఎంత మేర రసాయన వ్యర్థాలు నిలువ ఉన్నాయో గుర్తించాల్సి ఉంటుంది. వెంటనే జలాలను పీఈటీఎల్కు కానీ లేదంటే జేఈటీఎల్కు కానీ పంపించాలి. ఈ విషయంలో పీసీబీ నిర్లక్ష్యం వహిస్తుండటంతో పరిశ్రమల యాజమాన్యాలు ఇదే అదునుగా వాన నీటిలో కలిపి ఇష్టానుసారంగా బయటకు వదిలేస్తున్నాయి. ఫలితంగా సమీప ప్రాంతాల్లో ఉండలేని దుస్థితి. గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ నిల్వలు ఉన్నట్లు కొందరు పీసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే చర్యలు మాత్రం శూన్యం. వాన కురవగానే వ్యర్థాలను వదిలేస్తున్నారని, ఇళ్లలో ఉండలేకపోతున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు.
నిఘా పెట్టక..: ఖాజీపల్లి, గడ్డపోతారంలో సమస్యను సంబంధిత అధికారులు వేరే రకంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాల వ్యర్థాలు కాదు.. కాలనీలు, అపార్ట్మెంట్ల నుంచి వస్తున్న వ్యర్థ జలాలంటూ నివేదిక ఇచ్చారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. నిఘా పెట్టాల్సిన అధికారులు కార్యాలయాలకు పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నీటి వనరులన్నీ..: పారిశ్రామిక వాడల్లో ఎటుచూసినా కాలుష్య జలాలే కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు వ్యర్థాలతోనే నిండిపోయాయి. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే గతంలో కంటే పరిస్థితిలో మార్పు వచ్చింది, తాఖీదులు ఇచ్చి నమూనాలు సేకరిస్తున్నామంటూ చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో నీటి వనరులు విషపూరితంగా మారాయి. ఇకనైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రయోజనంగా ఉంటుంది.
నిఘా పెంచాం: కుమార్పాఠక్, పీసీబీ ఈఈ, రామచంద్రాపురం
కాలుష్య కారకులను పట్టుకునేందుకు ఇటీవల మరింత నిఘాను పెంచాం. ఇప్పటికే పలు సూచనలు చేశాం. కొన్ని పరిశ్రమలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఇటీవల ఖాజీపల్లి శివారులో పారింది కాలుష్య జలం కాదు, మురుగు నీరు. వ్యర్థాలను ఎవరు వదిలినా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే