ఏకరూపం.. ఆలస్యం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది.
ఇప్పటి వరకు సగం వస్త్రమే రాక
న్యూస్టుడే, మెదక్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. ఈ విద్యాసంవత్సరంలోనూ సమస్య పునరావృతం కానుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు ఇప్పటికీ ముడిసరకు సగం మాత్రమే వచ్చింది. దాన్ని కత్తిరించి స్వయం సహాయక సంఘాలకు అందించాల్సి ఉంది. ప్రస్తుతం ఒక జత చొప్పున పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో 78,286 మంది విద్యార్థులు
జిల్లాలో 899 ప్రభుత్వ బడుల్లో 78,286 మంది చదువుతున్నారు. వారికి ఏడాదికి రెండు జతల చొప్పున 1,56,572 పంపిణీ చేయాలి. ప్రతిసారి టెస్కో నుంచి ముడిసరకు జిల్లాకు వస్తుంది. ఈసారి ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే చేరింది. దుస్తులు కుట్టే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి, మెప్మా ఆధ్వర్యంలో కొనసాగే స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. జత కుట్టేందుకు ప్రభుత్వం రూ.50 చెల్లిస్తోంది. వచ్చే నెల 12న బడులు పున:ప్రారంభం కానున్నాయి. ఆలోగా ఒక జత అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి వచ్చిన వస్త్రం పూర్తిస్థాయిలో జిల్లాకు చేరలేదు. కేవలం షర్ట్, ప్యాంట్కు సంబంధించి మాత్రమే అందింది. బాలికలకు సంబంధించి రాగానే మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ఈ ప్రక్రియకు మరో రెండు, మూడ్రోజులు పట్టే అవకాశముంది. పనుల వేగవంతానికి మండల స్థాయిలో ఎంఈవో, నోడల్ అధికారి, ఎంఐఎస్లతోపాటు డీఆర్డీఏ, మెప్మాకు చెందిన ఏపీఎంలతో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు.
92 కుట్టు కేంద్రాలు...
గతేడాది దుస్తుల డిజైన్ మారడంతో కుట్టు కూలీ సరిపోదని స్వయం సహాయక సంఘాల మహిళలు కొద్దిరోజులు వస్త్రాన్ని వారి దగ్గరే ఉంచుకొని తిరిగి విద్యాశాఖ అధికారులకు ఇచ్చారు. దీంతో వారు పాలనాధికారిని సంప్రదించారు. చివరికి హైదరాబాద్లోని ఏజెన్సీలకు అప్పగించారు. దీంతో పాఠశాలలు ప్రారంభమై చాలా రోజులైనా విద్యార్థులకు యూనిఫాం అందలేదు. ఈసారి బడులు తెరిచే నాటికి ఒక జత ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో 92 కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు పాఠశాలల్లో కొలతలు తీసుకున్నారు. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో ఎస్ఎంసీల స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇందులో స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళ పాఠశాల ఛైర్మన్గా, హెచ్ఎం కన్వీనర్గా కొనసాగుతున్నారు.
ఒక జత అందిస్తాం..
రాధాకిషన్, జిల్లా విద్యాధికారి
వస్త్రం జిల్లాకు చేరింది. మరో విడత సోమవారం రానుంది. ఈసారి కొంత ఆలస్యంగా వచ్చింది. దుస్తులను కుట్టే బాధ్యత జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షిస్తోంది. బడులు ప్రారంభమయ్యే నాటికి ఒక జత దుస్తులను విద్యార్థులకు అందిస్తాం. దీనికిగాను మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు