భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు.
ప్రైవేటు భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు
తూప్రాన్: అద్దె భవనంలో నీటిపారుదల శాఖ భవనం
న్యూస్టుడే- తూప్రాన్, హవేలిఘనపూర్, రామాయంపేట: జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో శాఖల అధికారులు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల యజమానులు కార్యాలయాలకు తాళాలు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల అద్దె బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాల పునర్విభజన తరవాత కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి. చాలాచోట్ల ప్రభుత్వ శాఖలకు సొంత భవనాల్లేవు. అద్దె భవనాల్లోనే కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కష్టాలు తీరడం లేదు. కొన్నిచోట్ల అధికారులు, సిబ్బంది అష్టకష్టాలు పడి అద్దెలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన తరవాత బిల్లులు తీసుకుంటున్నారు. పలు కార్యాలయాల్లో విద్యుత్తు బకాయిలు సైతం పేరుకుపోవడంతో సంబంధిత అధికారులు సరఫరా నిలిపేస్తున్నారు. దీంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. ఉన్నతాధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయా కార్యాలయాల సిబ్బంది కోరుతున్నారు.
హవేలిఘనపూర్లో తహసీల్దార్ కార్యాలయం
తూప్రాన్లో ఆర్డీవో, నీటిపారుదల శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించిన అద్దె నెలనెలా రాకపోవడంతో యజమానులు సౌకర్యాలు కల్పించడం లేదు. ఒక్కోసారి భవనాలకు తాళాలు వేసుకొని వెళుతున్నారు. దీంతో ప్రజలకు అందాల్సిన సేవలు ఆగిపోతున్నాయి. పుర పరిధి పోతరాజ్పల్లిలో 14 ఏళ్లుగా ఈఎస్ఐ ఆస్పత్రిని అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. 8 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాన్ని భవనానికి తాళం వేశారు. 48 రోజులైనా అధికారులు, పాలకులు స్పందించకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. జిల్లాలోని 6వేల మందికిపైగా కార్మికులు ఈ ఆస్పత్రిలో సేవలు పొందుతున్నారు. తాళం ఉండడంతో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు నిత్యం వచ్చి వెళుతున్నారు. హవేలిఘనపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. కొత్త మండలంగా ఏర్పడినప్పట్నుంచి ఇందులోనే సేవలు అందిస్తున్నారు.
రామాయంపేటలో ఆబ్కారీశాఖ కార్యాలయం
రామాయంపేటలో ఆబ్కారీశాఖ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఆర్నెల్లకోసారి అద్దె వస్తోందని యజమానులు చెబుతున్నారు. సరిపడా వసతులు లేకున్నా సర్దుకుపోతున్నామని అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. సొంత భవనం ఉంటే ఇబ్బందులు తీరతాయంటున్నారు. ఆబ్కారీశాఖ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని యజమాని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?