వరుణాగ్రహం.. అతలాకుతలం
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
పంటలకు తీవ్ర నష్టం
చిన్న గొట్టిముక్లలో బురద నీటిలో నుంచి ధాన్యాన్ని ఎత్తుతున్న రైతులు
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
హవేలిఘనపూర్, న్యూస్టుడే: జిల్లా సరిహద్దులోని పోచారం అభయారణ్యం వద్ద ఆదివారం వీచిన ఈదురు గాలులకు వృక్షాలు విరిగిపడ్డాయి. పార్కు కార్యాలయం పైకప్పు రేకులు, గేటు ధ్వంసమయ్యాయి. మెదక్- బోధన్ ప్రధాన రహదారిపై కొమ్మలు పడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
చెన్నాపూర్లో తడిసి ముద్దయిన ధాన్యాన్ని చూపుతున్న రైతు ఆంజనేయులు
ముంచిన అకాల వర్షాలు
శివ్వంపేట: మండలంలో భారీ వర్షం కురిసింది. చిన్నగొట్టిముక్లలో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబెట్టిన ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. బస్తాలు తడిసి ముద్దయ్యాయి. చెన్నాపూర్ కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. టీక్యాదేవమ్మగూడెం తండా పాఠశాల దగ్గర భారీ చెట్టు కొమ్మ చౌరస్తా రోడ్డుపై విరిగి పడిపోయింది. చిన్న గొట్టిముక్ల చౌరస్తాలోనూ చెట్టు కొమ్మ విరిగింది. చెన్నాపూర్, టీక్యాదేవమ్మగూడెం తండాలో కూరగాయలు సాగు చేస్తున్న పొలాల్లో వర్షపు నీరు నిలిచింది.
నష్టాలపాలయ్యామని ఆందోళన
చిలప్చెడ్: కష్టపడి పండించిన ధాన్యం వర్షార్పణమైంది. కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయింది. మండలంలోని చిట్కుల్, చండూర్, గౌతాపూర్, అజ్జమర్రి, చిలప్చెడ్, సోమక్కపేట, ఫైజాబాద్ కొనుగోలు కేంద్రాల్లో వర్షపు నీరు ధాన్యం కుప్పల చుట్టూ నిలిచింది. నష్టాలపాలయ్యామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఉద్ధృతంగా పారిన వాగు
అల్లాదుర్గం: మండలంలోని గడి పెద్దాపూర్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో గ్రామ శివారులోని పెద్ద చెరువులోకి వచ్చే వాగు ఉద్ధృతంగా పారింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిబ్బంది స్పందించి సమస్య పరిష్కరించారు.
చందాపూర్లో నేలకూలిన విద్యుత్తు స్తంభం
చిన్నశంకరంపేట: ఈదురు గాలులకు మండల పరిధి చందాపూర్లోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్తు స్తంభం నేలకూలింది. మండలంలోని అంబాజీపేట, శాలిపేట, గజగట్లపల్లి, రుద్రారం, జంగరాయిలో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో పాక్షికంగా ధాన్యం తడిచింది.
మండల కేంద్రంలో 4 సెం.మీ. వర్షపాతం
కౌడిపల్లి: మండలం కేంద్రంలో ఆదివారం గంటన్నరపాటు గాలిదుమారంతో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోయింది. కుప్పల్లోకి వరద చేరింది. ఆరబెట్టింది పూర్తిగా వరదపాలైంది. దాదాపు 4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు.
ట్రాక్టరు ధాన్యం తడిచింది..
సయ్యద్ సద్దాం హుసేన్, రైతు, చిన్న గొట్టిముక్ల
చిన్న గొట్టిముక్ల ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు కావొస్తోంది. సకాలంలో కొనకపోవడంతో ట్రాక్టరు ధాన్యం భారీ వర్షానికి తడిచింది. వరద వచ్చి వాగులోకి కొట్టుకుపోయింది. పంట పండినా లాభం లేకుండాపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి