బాలలకు బాసట 1098
గత మార్చిలో కొమురవెల్లి మండలంలోని ఒక గ్రామంలో 17 ఏళ్ల బాలికకు వివాహం నిశ్చయమైందంటూ చైల్డ్లైన్ విభాగం టోల్ ఫ్రీ నంబరు 1098కి సమాచారం చేరింది.
ఎనిమిది నెలలుగా టోల్ ఫ్రీ సేవలు
చైల్డ్ లైన్ విభాగంలో ఫిర్యాదుల నమోదు
న్యూస్టుడే, సిద్దిపేట: గత మార్చిలో కొమురవెల్లి మండలంలోని ఒక గ్రామంలో 17 ఏళ్ల బాలికకు వివాహం నిశ్చయమైందంటూ చైల్డ్లైన్ విభాగం టోల్ ఫ్రీ నంబరు 1098కి సమాచారం చేరింది. నిజ నిర్ధారణ చేసుకున్న సిబ్బంది సంబంధిత శాఖకు సమాచారం చేరవేశారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాల్య వివాహాల నిరోధక అధికారులు, ఇతర శాఖల సిబ్బంది వెంటనే బాలిక ఇంటికి చేరుకొని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయబోమంటూ లిఖితపూర్వకంగా పత్రాన్ని రాయించారు. ఆ తదుపరి మూడుసార్లు పరిశీలన చేశారు.
చైల్డ్ లైన్ విభాగం.. 18 ఏళ్లలోపు బాలబాలికలకు బాలబాలికలకు బాసటగా నిలుస్తోంది. జిల్లాలో గతేడాది ఈ విభాగం సేవలు మొదలయ్యాయి. టోల్ ఫ్రీ నం. 1098 ద్వారా అందే సమస్యలను ఆలకించే విభాగం.. పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటోంది. అందుకు వివిధ శాఖల సమన్వయంతో ముందడుగు వేస్తోంది. కలెక్టరేట్లోని కార్యాలయంలో కొనసాగుతున్న ఈ విభాగం రోజులో 24 గంటలు పని చేస్తోంది.
ప్రతి నెలకు 20 చొప్పున.. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో కొనసాగే చైల్డ్ లైన్ విభాగాన్ని గత ఏడాది జులైలో ప్రారంభించారు. అక్టోబరు నుంచి టోల్ ఫ్రీ నం. 1098 సేవలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 200కి పైగా కాల్స్ స్వీకరించారు. ప్రతి నెలకు 20 మందికి పైగా వినియోగించుకుంటున్నారు. సలహాలు, సూచనలు, సమస్యలు ఏవైనా 1098కి ఫోన్ చేయగానే.. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో సిబ్బంది స్పందించి సమస్యను నమోదు చేస్తారు. జిల్లాకు బదలాయించిన తదుపరి సంబంధిత శాఖ జిల్లా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర స్థాయిలోనే కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తారు.
వీటిపైనే అధిక ఫిర్యాదులు
జిల్లా పరిధిలో ఎక్కువగా బాల్య వివాహాలు, బడి మానేసిన పిల్లలు, కుటుంబ సమస్యలతో ఇబ్బందిపడే వారు, ఆవాసం, విద్య, వసతి లేని బాలబాబాలికల సమాచారం చేరుతోంది. వివిధ రకాల వేధింపులకు గురైనపుడు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, బాల కార్మికులుగా పని చేసిన సందర్భంలోనూ ఫిర్యాదులు అందుతున్నాయి.
బలోపేతం అవశ్యం..
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఎనిమిది పోస్టులుంటే ఆరుగురే పని చేస్తున్నారు. ప్రధానమైన సమన్వయకర్త, కౌన్సెలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు చొప్పున సూపర్వైజర్లు, కేస్ వర్కర్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. సూపర్వైజర్లు రోజుకు మూడు విడతల్లో అందుబాటులో ఉంటున్నారు. కేసు వర్కర్లు.. క్షేత్రస్థాయిలో పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాలు, గ్రామాలు, జన సమూహాల వద్ద అవగాహన కల్పిస్తున్నారు. ఈ విభాగం సేవలను విస్తృతం చేయడంతో పాటు బలోపేతం చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి