రారండి.. కళాశాలలో చేరండి..
సొంత భవనాలు.. విశాలమైన మైదానాలు.. అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి.
ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి
ఊరూరా ప్రభుత్వ అధ్యాపకుల ప్రచారం
నంగునూరు మండలంలో విద్యార్థి వివరాలు సేకరిస్తున్న కళాశాల సిబ్బంది
న్యూస్టుడే, సిద్దిపేట: సొంత భవనాలు.. విశాలమైన మైదానాలు.. అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల క్రతువు మొదలైంది. మే 9వ తేదీన ప్రారంభమైన మొదటి విడత ప్రక్రియ 31వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రవేశాల సంఖ్యను పెంచి సీట్లు భర్తీ చేయడమే లక్ష్యంగా ఇంటర్ విద్యా శాఖ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది.
జిల్లాలో గత విద్యా సంవత్సరం ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో మొత్తం 6194 మంది చదివారు. అప్పట్లో ప్రథమ సంవత్సరంలో 3196 మంది చేరారు. విభాగాల వారీగా పరిశీలిస్తే.. జనరల్లో 2327 మంది, ఒకేషనల్లో 869 మంది ఉన్నారు. జిల్లాలో ప్రథమ సంవత్సరంలో దాదాపు 5 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లను భర్తీ చేసేలా దృష్టి సారించారు.
ప్రత్యక్షంగా కలుస్తూ.. కళాశాలల పరిధిలో ప్రత్యేకంగా కరపత్రాలు రూపొందించి.. బ్యానర్లను ప్రదర్శిస్తూ అధ్యాపకులు ముందుకు సాగుతున్నారు. ఊరూరా తిరుగుతూ పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలుస్తూ కళాశాల విశేషాలు చెబుతున్నారు. వసతులు, ప్రయోగశాలలు, ఒనగూరే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ఏటా పాఠ్య పుస్తకాలు పంపిణీ సహా ఫలితాల సాధనకు శ్రమిస్తున్న తీరును వల్లెవేస్తున్నారు. గతేడాది ఇదే తరహాలో చేసిన ప్రయత్నం కొంత మేర సత్ఫలితాలు ఇచ్చింది.
జిల్లాలో తగ్గుతున్న ప్రైవేటు కళాశాలలు..
జిల్లాలో ప్రైవేటు కళాశాలల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గురుకులాల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరుతుండటం ఒక కారణమైతే ఉపకార వేతనాలు సకాలంలో రాకపోవడంతో మరో కారణమవుతోంది. దీంతో నిర్వహణ భారమై గతేడాది జిల్లాలో మూడు కళాశాలలు మూసివేశారు. ఈసారి మరికొన్ని అదే బాటలో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 26 ప్రైవేటు కళాశాలలు కొనసాగుతున్నాయి. గతేడాది సుమారు 5 వేల మంది చదివారు. ఏటా అనుమతి కోసం ఇంటర్బోర్డుకు దరఖాస్తు (రెన్యూవల్) చేసుకుంటుండగా.. ఇప్పటి వరకు జిల్లాలో 8 అనుమతి పొందాయి. మిగిలినవి వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి.
సమష్టి సహకారంతో..
-సూర్యప్రకాశ్, జిల్లా ఇంటర్ విద్యాధికారి
అన్ని వసతులతో ప్రభుత్వ కళాశాలలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి. ఈసారి ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. సమష్టి సహకారంతో విద్యార్థుల సంఖ్యను పెంచుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ