ఉన్నతీకరణకు నోచని పది కస్తూర్బాలు
అనాథ, నిరుపేద బాలికలు, బడి బయటి పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. పదో తరగతి పూర్తి చేసిన తరువాత ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో లేకపోవడంతో సీటు దక్కని చాలా మంది
ఇంటర్ నిర్వహణకు చేజారిన అవకాశం
ఇంటర్కు అప్గ్రేడ్ కాని కాశీపూర్లోని కస్తూర్బా పాఠశాల
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, కంది: అనాథ, నిరుపేద బాలికలు, బడి బయటి పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. పదో తరగతి పూర్తి చేసిన తరువాత ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో లేకపోవడంతో సీటు దక్కని చాలా మంది విద్యార్థినులు ప్రైవేట్ కళాశాలల్లో చదివే స్థోమత లేకపోవడంతో ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. ఇందులో 6 నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. గతంలోనే జిల్లాలో 10 కస్తూర్బా పాఠశాలలను ఇంటర్మీడియట్కు అప్గ్రేడ్ చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు కళాశాలలకు అవకాశం కల్పించారు. వచ్చే విద్యా సంవత్సరం కోసం ఇప్పటికీ కొత్తగా కస్తూర్బాల ఉన్నతీకరణ కేటాయింపులు లేవు. ఇప్పటికే ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రాంరంభం కానుంది. సమగ్ర శిక్ష అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కొత్తగా మూడు పాఠశాలలకు అనుమతిచ్చిన ఉన్నతాధికారులు.. కళాశాలల మంజూరు అంశానికి ఆమోదం తెలపలేదు.
ప్రతిపాదనలు పంపించినప్పటికీ..
జిల్లాలో 17 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో మరో మూడు ప్రారంభం కానున్నాయి. దీంతో కస్తూర్బాల సంఖ్య 20కి చేరనుంది. వీటిలో 10 పాఠశాలల్లో మాత్రమే ఇంటర్మీడియట్ అమలవుతోంది. 2021-23 విద్యా సంవత్సరంలో సంవత్సరంలో కొండాపూర్కు, 2023-24 విద్యా సంవత్సరంలో రాయికోడ్, పుల్కల్ మండలాలకు ఇంటర్మీడియట్ను కేటాయించారు. అన్నింటికీ అవకాశం దక్కాలని జిల్లా సమగ్ర శిక్ష అధికారులు ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అనుమతి ఇవ్వలేదు. కొత్త కళాశాలలు వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతీ ఏడాది కస్తూర్బాల్లో 700 మందికిపైగా బాలికలు పదో తరగతి పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతమున్న 7 కళాశాలల్లో 400 మంది మాత్రమే ప్రవేశాలు పొందుతున్నారు. వీటిలో సీట్లు లభించని విద్యార్థినులు నిరుత్సాహంగా వెనక్కి వెళుతున్నారు. అధికారులు స్పందించి కొత్త కళాశాలలు కేటాయించేలా చూడాలని కోరుతున్నారు. కస్తూర్బాల్లో ఉత్తమ బోధనతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన పేద విద్యార్థినులు కూడా ఇందులో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొత్త కళాశాలలు రాకపోతే విద్యార్థినులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇకనైనా అధికారులు స్పందించాలని విద్యార్థినులు కోరుతున్నారు.
ఎక్కడెక్కడ..
హత్నూర, కంది మండలం కాశీపూర్, కంగ్జి, మనూరు మండలం పుల్కుర్తి, మునిపల్లి మండలం తాటిపల్లి, రామచంద్రాపురం, నాగల్గిద్ద, గుమ్మడిదల, చౌటకూరు, న్యాల్కల్ కస్తూర్బా విద్యాలయాలు ఇంటర్మీడియట్కు ఉన్నతీకరణ పొందాల్సి ఉంది.
ఉన్నతాధికారులకు మరోసారి విన్నవిస్తాం: సుప్రియ, జిల్లా బాలికల అభివృద్ధి అధికారిణి
కస్తూర్బాల్లో ఇంటర్ అప్గ్రేడ్కు సంబంధించి ఇప్పటి వరకు ఆదేశాలు రాలేదు. మూడు కొత్త పాఠశాలలు మాత్రమే మంజూరు చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు మరోసారి విన్నవిస్తాం. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?