పేర్లు ఉండవు... వివరాలు కానరావు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశ్రమ వివరాలతో గేటు వద్ద బోర్డు ఏర్పాటు చేయాలి. పేరు, స్థాపన, ఉత్పత్తుల వివరాలు నమోదు చేయాలి.
అక్రమాలకు అడ్డాలుగా పారిశ్రామికవాడలు
ఐడీఏ బొల్లారంలోని పారిశ్రామికవాడ
- గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో మత్తు పదార్థాలు తయారు చేస్తూ పటుబడ్డారు. దీంతో డ్రగ్స్ కంట్రోల్ విభాగం, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పరిశ్రమ వివరాలు తెలుసుకోవటానికి ఐదారు గంటలు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
- ఏడాది క్రితం ఐడీఏ బొల్లారంలోని మూతపడిన పరిశ్రమలో మత్తు మందు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అధికారుల రాకను చూసి అందులో పనిచేసే వారంతా పరారయ్యారు. పరిశ్రమ ముందు ఎలాంటి బోర్డులు లేవు.
న్యూస్టుడే, జిన్నారం: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశ్రమ వివరాలతో గేటు వద్ద బోర్డు ఏర్పాటు చేయాలి. పేరు, స్థాపన, ఉత్పత్తుల వివరాలు నమోదు చేయాలి. ఉత్పత్తుల ద్వారా వచ్చే వ్యర్థాలు, వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలను పేర్కొనాలి. రసాయన పరిశ్రమలయితే ఎలక్ట్రానిక్స్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేసి పీసీబీకి అనుసంధానించాలి. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఈ నిబంధనలు చాలా చోట్ల అమలు కావడం లేదు. ఒక్కోసారి అంతర్జాతీయ స్థాయిలో మత్తు మందు, డ్రగ్స్ పట్టుపడినపుడు ఇక్కడ సంబంధిత పరిశ్రమలు ఎక్కడున్నాయో తెలియని అయోమయం నెలకొంటోంది. పన్నులూ ఎగవేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ప్రత్యేక దృష్టి సారించాల్సినవి
జిల్లాలోని అన్ని పారిశ్రామికవాడల్లోనూ అక్రమాలు గుట్టుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఐడీఏ బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి, పటాన్చెరు, పాశమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్, రుద్రారం, ముత్తంగి, బండ్లగూడ, హత్నూర, జహీరాబాద్, సదాశివపేట తదితర ప్రాంతాలపై జిల్లా పరిశ్రమల శాఖతో పాటు టీఎస్ఐఐసీ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. పీసీబీతో పాటు డ్రగ్స్ కంట్రోల్ విభాగం, పరిశ్రమల కర్మాగారాల భద్రతా శాఖ, అగ్నిమాపక శాఖలతో పాటు స్థానిక సంస్థలు అక్రమాల కట్టడికి సమన్వయంతో పనిచేయాలి. వీరు సంబంధిత యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొచ్చి నిబంధనలు అమలయ్యేలా చూడాలి.
పట్టించుకోని అధికారులు
అక్రమాలకు కేంద్ర బిందువులుగా గేటు బయట వివరాలు వెల్లడించని పరిశ్రమల వద్దనే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్య అధికారుల దృష్టికి వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి పరిశ్రమ గేటు వద్ద కంపెనీ వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని పీసీబీ ఈఈ కుమార్ పాఠక్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు