స్త్రీనిధి.. పెన్నిధి
పొదుపు సంఘాల్లో చేరుతున్న మహిళలు పేదరికం నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు సులభంగా అందుతున్నాయి.
రుణ లక్ష్యాలు ఖరారు
సమష్టి కృషితోనే మహిళలకు ప్రయోజనం
మహిళా సంఘం సభ్యులు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, జోగిపేట, సిద్దిపేట, పరిగి, తాండూరు, జహీరాబాద్, వికారాబాద్ మున్సిపాలిటీ: పొదుపు సంఘాల్లో చేరుతున్న మహిళలు పేదరికం నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు సులభంగా అందుతున్నాయి. రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించడమే ఇందుకు ప్రధాన కారణం. పొదుపు చేస్తూనే రుణాలతో స్వయం ఉపాధి దిశగా పలువురు అడుగులు వేస్తూ కుటుంబ ఉన్నతిలో భాగస్వాములు అవుతున్నారు. స్త్రీనిధి రుణాలు తోడుకావడంతో మహిళాభ్యున్నతికి బాటలు పడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు స్త్రీనిధి రుణ లక్ష్యాలను ఖరారు చేశారు.
సంగారెడ్డి జిల్లాకు అత్యధికం: మహిళా సంఘాలకు స్త్రీనిధి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాకు కేటాయించడం గమనార్హం. సమష్టిగా ముందుకు సాగితే లక్ష్యాలను చేరుకోవడం సులభమే.
స్వయం ఉపాధి యూనిట్లకు ప్రాధాన్యం: స్త్రీనిధి ద్వారా అందించే రుణాలను స్వయం ఉపాధి యూనిట్లకు మంజూరు చేస్తారు. దీనివల్ల తీసుకున్న రుణాలను వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లింపులకు ఇబ్బంది ఉండటం లేదు. పెరటి కోళ్ల పెంపకం, పాడి గేదెలు, కొత్త వ్యాపారాలు, వ్యాపారాల విస్తరణకు రుణాలు అందిస్తారు. తక్కువ ధరలకే ఔషధాల విక్రయానికి ఉద్దేశించిన జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకూ రుణ సదుపాయం కల్పిస్తారు.
నెలకోసారి సమన్వయం: ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీనిధి అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏదైనా గ్రామైక్య సంఘం పరిధిలో సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత వీవోఏతో మాట్లాడి రుణాల పంపిణీ వేగవంతమయ్యేలా చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయించాలని భావిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఏ నెలకు సంబంధించిన లక్ష్యాలను అదే నెలలో అదిగమించేందుకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు.
ఆర్థికోన్నతికి సద్వినియోగం చేసుకోవాలి: మోహన్రెడ్డి, స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్
మహిళా సంఘాల సభ్యుల ఉన్నతి లక్ష్యంగా స్త్రీనిధి రుణాలు మంజూరు చేస్తున్నాం. స్వయం ఉపాధి యూనిట్లకే రుణాలు అందించడం ఇందులో భాగమే. తీసుకున్న రుణాలను ఇంటి అవసరాలకే వినియోగించుకుంటే తిరిగి చెల్లింపులు కష్టంగా మారుతుంది. ఉపాధి యూనిట్లు నెలకొల్పడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. బ్యాంకు రుణాలకు తోడు స్త్రీనిధి రుణాలు తీసుకోవడంతోపాటు సద్వినియోగంపై అవగాహన పెంపొందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల