చిరుధాన్యాల సాగు.. ఆదర్శానికి సరితూగు
పంటల సాగులో పురుగు మందుల వల్ల ఆహార పదార్థాల్లో అవశేషాలు ఉండి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కొంతమంది రైతులు సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించారు.
రైతు నిర్మించిన గొర్రెల పాక
జగదేవపూర్, న్యూస్టుడే: పంటల సాగులో పురుగు మందుల వల్ల ఆహార పదార్థాల్లో అవశేషాలు ఉండి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కొంతమంది రైతులు సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించారు. అవగాహన కలిగిన వినియోగదారులు చిరుధాన్యాల ఆహారాన్ని రోజూ తీసుకోవడంతో వాటికి డిమాండ్ పెరిగింది. అధిక పోషకాలు కలిగిన చిరుధాన్యాల పంటలను సాగు చేస్తున్నారు. తోటి రైతులకు విత్తనాలు ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అలిరాజపేట గ్రామానికి చెందిన రాచమల్ల కిష్టయ్య, మొగిలి కరుణాకర్రెడ్డి తమ 3, 2 ఎకరాల్లో మూడేళ్లుగా చిరుధాన్యాల సాగు చేస్తున్నారు.
గొర్రెల పెంపకం అదనం: తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటలను పండించడం ఎలాగో చేసి చూపిస్తున్నారు. ప్రధానంగా సజ్జ, కొర్రలు, రాగులు, పచ్చ జొన్న, మక్కలు వేస్తున్నారు. ఖాళీ స్థలం, గట్లపైన వాటికి తోడుగా కూరగాయలు పండిస్తున్నారు. కరుణాకర్రెడ్డి తన ఖాళీ స్థలంలో పాక నిర్మించి అందులో 50 గొర్రెలను సాకుతున్నారు. పంటల ద్వారా వచ్చిన గ్రాసం, కొంత పచ్చి గడ్డి వంటివి మేపుతున్నారు.తక్కువ సమయంలోనే ఒకవైపు చిరుధాన్యాల పంటలు.. మరోవైపు జీవాలతో మాంసం ఉత్పత్తికి తోడ్పడుతున్నారు. ఫలితంగా అదనపు ఆదాయం సమకూరుతోంది. వీరి సాగు తీరు చూసి ఇతర రైతులు మక్కువ చూపుతున్నారు.
సౌర కంచెతో రక్షణ: రాచమల్ల కిష్టయ్య
చిరుధాన్యాల ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలని తెలుసుకున్నా. హాస్ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన శిక్షణకు హాజరైన. అనేక విషయాలు తెలుసుకున్నా. కుటుంబ సభ్యుల ఆహారంలో రోజు చిరుధాన్యాల వంటకాలు ఉంటాయి. అడవి పందులు, కోతుల బెడద నివారణకు సౌర కంచె వేసుకొని పంటలకు రక్షణ కల్పిస్తున్నా.
అతిథులకు పాయసం: మొగిలి కరుణాకర్రెడ్డి
ఇంటికి వచ్చిన అతిథులకు కొర్రలతో తయారుచేసిన పాయసం తప్పకుండా ఇస్తాం. చిరుధాన్యాల గింజలు కొన్ని బంధువులకు పంపిస్తాం. రసాయన అవశేషాలు లేని ఆహారంగా చిరుధాన్యాల వంటకాలకు ప్రాధాన్యం పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్