logo

ఈసెట్‌లో చేగుంట పాలిటెక్నిక్‌ విద్యార్థికి ప్రథమ ర్యాంకు

చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివిన విద్యార్థి ఎ.గణేష్‌ ఈసెట్‌(ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు.

Published : 26 May 2024 02:17 IST

విద్యార్థిని గణేష్‌ను అభినందిస్తున్న ప్రిన్సిపల్‌ చక్రవర్తి 

చేగుంట, న్యూస్‌టుడే: చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివిన విద్యార్థి ఎ.గణేష్‌ ఈసెట్‌(ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. పాలిటెక్నిక్‌లో ఈఈఈ చదివాడు. మొదటి ర్యాంకు తెచ్చుకున్న గణేష్‌ జిల్లా కేంద్రమైన పెద్దపల్లికి చెందినవాడు. చేగుంటలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ బాలుర వసతిగృహంలో ఉండి చదువుకున్నాడు. ఇక్కడి మరో విద్యార్థి మహ్మద్‌ షమి రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంకు సాధించాడు. మెదక్‌ జిల్లా చేగుంటకు చెందిన షమి తండ్రి గౌస్‌ వెల్డింగ్‌ పనులు చేస్తుంటారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్‌ చక్రవర్తి, హెచ్‌వోడీ శ్రీనికేతన్, అధ్యాపకులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు