రైతులందరి ధాన్యం కొంటాం: కలెక్టర్
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి రైతు ధాన్యాన్ని కొంటామని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. మండలంలోని రెడ్డిపల్లిలో కొనుగోలు కేంద్రంను పరిశీలించారు.
దుస్తుల తయారీని పరిశీలిస్తున్న కలెక్టర్ రాహుల్
నర్సాపూర్ రూరల్: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి రైతు ధాన్యాన్ని కొంటామని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. మండలంలోని రెడ్డిపల్లిలో కొనుగోలు కేంద్రంను పరిశీలించారు. వర్షాలు వస్తే ఇబ్బందులు వస్తాయని, ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని ధాన్యం అరబెట్టి తీసుకువస్తే వెంటనే కొనుగోలు చేయడానికి సులువుగా ఉంటుందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్మిల్లులకు తరలించాలన్నారు. 55,466 రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి రూ.382.43 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. 163 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయిందని తెలిపారు. మెదక్ జిల్లా నుంచి సిద్దిపేటకు 10వేల మెట్రిక్ టన్నులు, మహబూబ్నగర్ 40వేలు, జోగులాంబ గద్వాలకు 10వేల అర్డర్ వచ్చినట్లు చెప్పారు. ఆర్డీవో జగదీశ్వర్రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, ఆర్ఐ సిద్దిరాంరెడ్డి, సీసీ ప్రవీణ, సీఏ మహేశ్వరితదితరులు ఉన్నారు.
స్ట్రాంగ్ రూముల పరిశీలన
నర్సాపూర్: పట్టణంలోని బీవీఆర్ఐటీ కళాశాలలోని ఈవీఎంల, పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూములను, సీసీ కెమెరాలకు సంబంధించిన కంట్రోల్ రూమును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం తనిఖీ చేశారు. భద్రతా చర్యల్ని, స్ట్రాంగ్ రూములలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. మూడంచెల భద్రత, రక్షణ ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీల రిజిష్టర్ నిర్వహణను చూశారు.
విద్యార్థులకు సకాలంలో అందించాలి...
పాపన్నపేట: పాఠశాలలు తెరిచే లోపు ఏకరూప దుస్తులు తయారుచేసి అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మండల పరిధిలోని యూసుఫ్పేటలో మహిళా స్వశక్తి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో 70 మహిళా స్వశక్తి సంఘాల ద్వారా 78,000ల ఏకరూప దుస్తుల తయారీ నడుస్తోందన్నారు. త్వరలో పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అందిస్తామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ దుస్తులు కుట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు అందజేయాలని ఆదేశించారు. తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఏపీఎం సాయిలు తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు గ్యారంటీలకు ‘భట్టి’ భరోసా
[ 26-07-2024]
ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు గట్టి భరోసా ఇచ్చింది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. అతివలకు అండగా నిలవనుంది. పేదలకు సొంతగూడు కల్పించేలా నిధులు కేటాయించింది. -
పథకాలకు ‘భట్టి’ పద్దు.. సంక్షేమ పొద్దు
[ 26-07-2024]
ఆరు గ్యారంటీలు.. ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. ప్రజాపాలన, ప్రగతికి పెద్దపీట వేసింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి తొలి పద్దు.. -
సంక్షేమ పథం.. హలధారికి అందలం
[ 26-07-2024]
అన్నదాతలు మురిసేలా.. మహిళా సాధికారతకు బాటలు పడేలా.. యువత ఉపాధికి అవకాశాలు మెరుగయ్యేలా.. బడ్జెట్లో అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని జిల్లాప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బడ్జెట్పై నేతల స్పందన..
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆరు గ్యారంటీల ఊసే లేదని భాజపా జిల్లా అధ్యక్షురాలు సి.గోదావరి అంజిరెడ్డి విమర్శించారు. జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంటూ సంగారెడ్డి పట్టణ ప్రధాన రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. -
ఆగస్టులో ఆటలకు సై
[ 26-07-2024]
విద్యార్థి దశ నుంచే ఆటలపై ఆసక్తి పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. -
చేదోడుగా ఉంటారనుకుంటే.. చేజారిపోయారా
[ 26-07-2024]
వారంతా ఇరవై ఏళ్లకు పైబడిన యువకులు. విధులకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఎదిగిన బిడ్డలు కుటుంబాలకు చేదోడుగా ఉంటారని భావించిన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చారు. -
సంచికి దూరం.. సృజనాత్మకతకు దోహదం
[ 26-07-2024]
చదువు భారంగా మారొద్దు.. భావితరానికి బాటలు వేయాలి. కిలోల కొద్దీ బరువుతో కూడిన సంచులు.. విద్యార్థిని ఒకింత ఆందోళనకు గురిచేస్తుంటాయి. శారీరక ఎదుగుదలపై కొంత ప్రభావం చూపుతుంది. -
తప్పుడు పత్రాలు సృష్టించిన ఆరుగురిపై కేసు
[ 26-07-2024]
తప్పుడు పత్రాలు సృష్టించి స్థలాన్ని కాజేయాలని చూసిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట వన్టౌన్ సీఐ లక్ష్మీబాబు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. -
విధులకు వెళుతూ అనంతలోకాలకు..
[ 26-07-2024]
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం తున్కిల్లతండా శివారులో సంగారెడ్డి-నాందేడ్ జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. -
రైలు ప్రయాణికుడికి తప్పిన ప్రాణాపాయం
[ 26-07-2024]
కదులుతున్న రైల్లోకి పరుగెత్తుతూ ఎక్కబోయి పట్టు తప్పి దానికింద పడిపోబోయాడు ఓ ప్రయాణికుడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే రక్షణ దళం పోలీసు వెంటనే స్పందించి అతడిని రక్షించి ఆపద్బాంధవుడిగా మారాడు. -
స్వామి సరే.. అమ్మవార్ల మాటేమిటి!
[ 26-07-2024]
భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న కొమురవెల్లి మల్లన్న గర్భగుడిలో స్వామికి ఇరువైపులా బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలు కొలువై ఉన్నారు. ఏటా రూ.18 కోట్లకు పైగా వార్షిక ఆదాయం సమకూరుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM