వంతెనతో ప్రమాదాలకు అడ్డుకట్ట
జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ.. తుదిదశకు చేరుకున్నాయి.
జప్తిశివునూర్ వద్ద రూ.29 కోట్లతో పనులు
నిర్మిస్తున్న ఉపరితల వంతెన
న్యూస్టుడే, నార్సింగి (చేగుంట): జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ.. తుదిదశకు చేరుకున్నాయి. నార్సింగి మండలం జప్తిశివునూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతుండేవి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి గ్రామంలోకి వెళ్తుంటే నిజామాబాద్ వైపు నుంచి వాహనాలు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది క్షతగాత్రులయ్యారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ రహదారి దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా వెళ్లినా ప్రమాదాలు జరుగుతాయి. వీటిని నివారించేందుకు ఉపరితల వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఆరు వరుసల రహదారి
జప్తిశివునూర్ వద్ద జాతీయ రహదారిపై ఉపరితల వంతెనను రూ.29 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇక్కడ వంతెన మంజూరు చేయాలని ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే, అప్పటి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్హెచ్ఏఐ అధికారులు సర్వే నిర్వహించి వంతెన మంజూరు చేశారు. టెండర్లు పూర్తి చేసిన అనంతరం జప్తిశివునూర్ వద్ద సుమారు ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభించారు. మొదట ఇరువైపుల సర్వీసు రోడ్లను నిర్మించారు. అనంతరం వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామంలోకి వెళ్లే చోట వంతెన పనులు పూర్తిచేశారు. దానికి ఇరువైపు సిమెంట్ దిమ్మెలతో గోడల నిర్మాణం దాదాపు పూర్తి చేశారు. ఒకవైపు కంకర కూడా వేశారు. మరోవైపు మట్టి పనులు చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆరు వరుసల రహదారి నిర్మాణం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.
ఉమ్మడి మండలంలో రెండు చోట్ల
ఉమ్మడి చేగుంట మండలంలో 44వ జాతీయ రహదారిపై రెండు చోట్ల వంతెనలను మంజూరు చేశారు. వంతెన నిర్మాణానికి రూ.19 కోట్లు మంజూరు చేశారు. ఇక్కడ వంతెన నిర్మాణం పూర్తిచేసి ప్రమాదాలు జరగకుండా చేశారు. అలాగే జప్తిశివునూర్ వద్ద కూడా నిర్మాణ పనులు చేపట్టి తుదిదశకు తీసుకొచ్చారు. చేగుంట వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండేవి. 2006 నుంచి సుమారు వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వంతెన పూర్తికావటంతో ప్రమాదాలు జరగటం లేదు. అలాగే జప్తిశివునూర్ వద్ద కూడా ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి