‘హెటిరో ల్యాబ్స్’లో భారీ అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని హెటిరో ల్యాబ్స్ పరిశ్రమలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
జిన్నారం, న్యూస్టుడే: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని హెటిరో ల్యాబ్స్ పరిశ్రమలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈటీపీ బ్లాక్లో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ అలుముకుంది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని పరిశ్రమ సీనియర్ మేనేజర్ రవిబాబు ప్రకటించారు. విద్యుత్తు షార్ట్సర్క్యూట్తో మంటలు రావొచ్చని పేర్కొన్నారు. పరిశ్రమకు చెందిన రెండు అగ్నిమాపక శకటాలు, పటాన్చెరు, జీడిమెట్ల నుంచి మరో రెండు వాహనాలను రప్పించి ఆర్పేశారు. సాల్వెంట్ ట్యాంకులపై మూతలు లేవటంతో రసాయనాలు పైకిలేసి ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఉంటాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భూవివాదంలో మారణాయుధాలతో దాడి
ఒకరి మృతి... మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
నారాయణఖేడ్, న్యూస్టుడే: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పురపాలిక పరిధిలోని చాంద్ఖాన్పల్లిలో భూవివాదం ఒకరి ఉసురు తీసింది. నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్రెడ్డి, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. చాంద్ఖాన్పల్లికి చెందిన అంకం లక్ష్మయ్య, మల్లయ్య, పక్కనేగల స్కూల్తండాకు చెందిన దేవీసింగ్ల భూములు పక్కపక్కనే ఉన్నాయి. కొన్నేళ్లుగా సరిహద్దుల వివాదాలు ఉండగా... కోర్టులో సివిల్ కేసు నడుస్తోంది. మూడు నెలల కిందట వివాదంలో ఉన్న భూముల్లో మల్లయ్య, దేవీసింగ్ కుటుంబీకులు చెట్లు నరికారు. దీనిపై లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చెట్ల మొదళ్లు, కొమ్మలు అక్కడే వదిలేశారు. సోమవారం ఉదయం వాటిని తీసుకెళ్లేందుకు మల్లయ్య, దేవీసింగ్లు కుటుంబీకులతో వచ్చారు. విషయం తెలుసుకుని అంకం లక్ష్మయ్య, ఆయన సోదరుడు అంకం రాములు, లక్ష్మయ్య కుమారుడు అశోక్ అక్కడకు చేరారు. మల్లయ్య, అతడి సోదరుడు జ్ఞానేశ్వర్తోపాటు ఆయన కుమారులు, దేవీసింగ్తోపాటు అతడి కుమారులు గొడ్డళ్లు, కత్తులు, కర్రలతో ఒక్కసారిగా వీరిపై దాడికి పాల్పడటంతో అంకం రాములు, అంకం లక్ష్మయ్య, అంకం అశోక్(40)లు గాయపడ్డారు. వారిని నారాయణఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అశోక్ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రాములును మెరుగైన వైద్యం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మయ్య ఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వెంకట్రెడ్డి, ఖేడ్, కంగ్టి సీఐలు, ఎస్సైలు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
పోలీసుల నిర్లక్ష్యమే కారణం: వివాదంలో ఉన్న భూమిపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా నిందితులు పట్టించుకోకుండా చెట్లు నరుకుతున్నారని గతంలో నాలుగుసార్లు ఖేడ్ ఠాణాలో ఫిర్యాదు చేసినా ఎస్సై విద్యాచరణ్రెడ్డి పట్టించుకోలేదని మృతుడి తండ్రి అంకం లక్ష్మయ్య ఆరోపించారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నందున ఆ భూమిలోకి ఎవ్వరూ వెళ్లవద్దని నిందితులకు పోలీసులు చెబితే ఇంత దారుణం జరిగేది కాదన్నాడు. తన కుమారుడి మృతికి ఎస్సై నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించాడు. దీనిపై ‘న్యూస్టుడే’ ఎస్సై వివరణ కోరగా... ఆయన కోర్టు ఆర్డర్ ప్రకారం ఆ స్థలంలోకి వెళ్లవద్దని ఇరు వర్గాలకు చెప్పినట్లు తెలిపారు. సీఐ శీనివాస్రెడ్డి మాట్లాడుతూ గతంలో ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయంపై తీసుకున్న చర్యలతోపాటు తాజా ఘటనపై విచారణ చేయిస్తామని పేర్కొన్నారు.
సూపర్ మార్కెట్లో రూ.5.53 లక్షల చోరీ
నంగునూరు, న్యూస్టుడే: సిద్దిపేట జిల్లా నంగునూరులో ఆదివారం అర్ధరాత్రి సూపర్మార్కెట్లో చోరీ జరిగింది. దుండుగులు రూ.5.53 లక్షలు ఎత్తుకెళ్లారు. రాజగోపాలపేట ఎస్సై భాస్కర్రెడ్డి తెలిపిన వివరాలు.. అక్కెనపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చామంతుల నరేశ్ నంగునూరులోని ఓ రేకుల షెడ్డును ఏడాదిన్నర క్రితం లీజుకు తీసుకొని పూర్ణ అనే సూపర్ మార్కెట్ నడుపుతున్నారు. సూపర్వైజర్ మహేందర్ ఆదివారం రాత్రి 8:45 గంటలకు దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి బీరువాలో దాచిన రూ.5.53 లక్షల నగదు కనిపించలేదు. పరిశీలించగా సూపర్ మార్కెట్ వెనక భాగం రేకులను తొలగించి దుండగులు లోపలికి వచ్చినట్లు తెలిసింది. ఏసీపీ మధు, సీఐ శ్రీను వచ్చి చూశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి