బడిగంటలు మోగే వేళ.. బస్సులు సిద్ధమేనా?
సకల సౌకర్యాలు ఉన్న బడిలో పిల్లలను చేర్పిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు ఆలోచన చేస్తుంటారు. విద్యాభ్యాసం, ఆటాపాటలతో సహా బడిలో విద్యార్థులకు మౌలిక వసతులు ఉండాలని కోరుకుంటారు.
పిల్లల భద్రత అత్యంత కీలకం
సామర్థ్య పరీక్షలు తప్పనిసరి
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్, వికారాబాద్ టౌన్: సకల సౌకర్యాలు ఉన్న బడిలో పిల్లలను చేర్పిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు ఆలోచన చేస్తుంటారు. విద్యాభ్యాసం, ఆటాపాటలతో సహా బడిలో విద్యార్థులకు మౌలిక వసతులు ఉండాలని కోరుకుంటారు. ప్రైవేటు పాఠశాలలు ఎంత దూరం ఉన్నా తమ పిల్లలను పంపించడానికి కారణం బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమే. ఆ బస్సులను ప్రతి ఏడాది రవాణా అధికారి కార్యాలయంలో (ఆర్టీఏ) తనిఖీ చేయించుకొని వాహన సామర్థ్య ధ్రువపత్రాన్ని పొందాల్సి ఉంటుంది. లేకపోతే బస్సును రోడ్లపై నడపకూడదు. బస్సు సామర్థ్యం ప్రమాణాలపరంగా సరిగా లేకపోతే ప్రయాణంలో ప్రమాదాలు జరుగుతాయి.
అనుమతి ఉంటేనే..: ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి (కంది), పటాన్చెరు, జహీరాబాద్, మెదక్, సిద్దిపేట, చేర్యాల, గజ్వేల్, హుస్నాబాద్లలో ఆర్టీఏ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వాటి పరిధిలో మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు), సహాయ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎఎంవీఐ)లు బస్సులకు పరీక్షలు నిర్వహిస్తారు. అనుమతులు లేని వాటికి జరిమానాలు, కేసులు నమోదులు చేస్తుంటారు. వాహనాలకు సంబంధించిన అన్నిరకాల పత్రాలు ఉన్నాయా? లేవా.. నిశితంగా పరిశీలిస్తారు. బడి బస్సులకు సామర్థ్య పరీక్షలపై ఆయా యాజమాన్యాలు దృష్టి సారించాల్సి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 2,384 బస్సులు ఉన్నాయి. ఇంకా 1,920 బస్సులకు (ఈ నెల 24 వరకు) అనుమతులు తీసుకోవాల్సి ఉంది.
12వ తేదీ గడువు
పాఠశాలలు ప్రారంభానికి ముందే బస్సుల డ్రైవర్లు, బస్సుల నిర్వహణపై దృష్టి సారిస్తే పిల్లలకు భద్రత చేకూరుతుంది. ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇప్పటికే ఆర్టీఏ కార్యాలయంలో బస్సుల తనిఖీ, ధ్రువపత్రాల జారీ మొదలైంది. వచ్చేనెల 12వ తేదీ వరకు పరీక్షలు చేయించుకోవాలని ఆర్టీఏ విభాగం సూచిస్తోంది. గడువులోపు ఏటా పరీక్షలు చేసుకోకుండానే కొన్ని పాఠశాలల నిర్వాహకులు అధికారుల కళ్లు గప్పి బస్సులు తిప్పుతున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆర్టీఏ అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
నిబంధనలు
- ఆర్టీఏ అధికారులు జారీ చేసిన సామర్థ్య పరీక్ష పత్రాలను బస్సులో ప్రదర్శించాలి.
- ప్రతి బడి బస్సుకు పసుపు రంగు తప్పనిసరి.
- 15 ఏళ్లు దాటిన వాహనాలను తిప్పరాదు.
- బస్సు బ్రేకులు, టైర్లు, అద్దాలు, లైట్లు, వైపర్లు బాగుండాలి.
- యాజమాన్యం వివరాలు, పిల్లల వివరాలు నమోదు చేయాలి.
- వాహనంలో ప్రథమ చికిత్స కిట్లు, మందులు, పరికరాలు ఉంచాలి..
- అగ్ని ప్రమాదాన్ని నివారించే టియర్ గ్యాస్ సిలిండర్లు తప్పనిసరి.
- డ్రైవర్ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.
- డ్రైవర్లు దురుసుగా ప్రవర్తించొద్దు.
- ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే డ్రైవర్పై ఫిర్యాదు చేయాలి.
- బస్సు సామర్థ్యాన్ని మించి విద్యార్థులను ఎక్కించుకోవద్దు.
- డ్రైవర్లకు కళ్లు, ఇతర ఆరోగ్య పరీక్షలు చేపట్టాలి.
- మద్యం తాగి వాహనం నడపొద్దు. లైసెన్సు రద్దవుతుంది.
యాజమాన్యాలు ముందుకు రావాలి
- వెంకటరమణ, ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్టీఏ అధికారి, సంగారెడ్డి
బస్సులకు ఆర్టీఏ శాఖ నుంచి అనుమతులు కచ్చితంగా ఉండాల్సిందే. నిబంధనలు పాటించకపోతే క్రిమినల్ కేసులు తప్పవు. ఇప్పటికే టీజీ స్కూల్ బస్సు ప్రత్యేక యాప్లో పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాం. యాప్లో బస్సు నంబర్ ఎంటర్ చేస్తే చాలు. బస్సు యాజమాని, డ్రైవర్ ఫొటో, సహాయకుడి వివరాలు ఫోన్ నంబర్లు కనిపిస్తాయి. సామర్థ్య పరీక్షలు చేసుకోకుండా పిల్లలతో ప్రయాణించడం చట్టరీత్యా నేరం.
పునఃప్రారంభంలోగా పూర్తి చేస్తాం
- వెంకట్రెడ్డి, వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి
జూన్ 12లోగా పాఠశాలలు ప్రారంభం అవుతాయి. అంతకంటే ముందుగానే అన్నిటికీ వాహన సామర్థ్య పరీక్షలు చేసుకునేలా చూస్తాం. విద్యార్థుల భధ్రత అత్యంత ముఖ్యమైంది. ఫిట్నెస్ చేయించుకున్న బస్సులనే రోడ్డుపై తిరిగేందుకు అనుమతిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు