నకిలీ విత్తనాల కట్టడికి ప్రత్యేక నజర్
నైరుతి రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలు సేకరించుకుంటున్నారు.
దుకాణాల్లోతనిఖీలు..
గ్రామాల్లోఅవగాహనసదస్సులు
న్యాల్కల్లో అధికారుల తనిఖీలు
న్యూస్టుడే, ఇస్మాయిల్ఖాన్పేట (సంగారెడ్డి అర్బన్), మనూరు,ఇంద్రకరణ్(కంది), జోగిపేట: నైరుతి రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలు సేకరించుకుంటున్నారు. ఇదే అదనుగా దళారులు, కొందరు వ్యాపారులు కర్షకులకు నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రమాదం ఉంది. గతేడాది ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయశాఖ అప్రమత్తమయింది. అన్ని విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు.. పల్లెల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు సదస్సులు కొనసాగడంతో పాటు.. దుకాణాల్లో తనిఖీలను విస్తృతం చేయనున్నారు.
సాగు అంచనా 7.24 లక్షల ఎకరాలు
జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి ఈ ఏడాది వానాకాలంలో 7,24,405 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. ఇందులో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి వేయనున్నారని, 7.20 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమని ప్రకటించారు. ప్రస్తుతం 1,33,665 పత్తి విత్తన ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలినవి రోజు వారీగా జిల్లాకు వస్తున్నాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 1.50 లక్షల ఎకరాల్లో వరి పంట వేయనున్నారు. 33,956 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. పెసర, మినుములు, కందులు తదితర పంటలకు అంచనాల మేరకు పీఏసీˆఎస్, డీసీఎంఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.
క్షేత్రస్థాయికి వెళుతూ..
జిల్లాలో సంగారెడ్డి, పటాన్చెరు, రాయికోడ్, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్ వ్యవసాయ శాఖ డివిజన్ కార్యాలయాలున్నాయి. వాటి పరిధిలో 510 ఎరువులు, విత్తనాల దుకాణాలున్నాయి. వ్యవసాయ అధికారులు డీలర్లకు, రైతులకు ఊరూరా సదస్సులు నిర్వహించి అప్రమత్తం చేస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
రైతులు పాటించాల్సినవి
లైసెన్సు ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తన ప్యాకెట్లు బస్తాలపై లాట్ నంబర్, కంపెనీ పేరు, ప్యాకింగ్ తేదీ, లేబుల్ వివరాలు ఉంటేనే కొనుగోలు చేయాలి. డీలరు ఇచ్చిన కొనుగోలు రసీదును భద్రపర్చుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండా విడిగా విక్రయించే విత్తనాలు కొనుగోలు చేయవద్దు. దళారుల మాటలు నమ్మవద్దు. సందేహముంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. నకిలీవి విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే వ్యవసాయ అధికారులు లేదంటే.. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వ్యాపారులు తప్పనిసరిగా విత్తన నిల్వలు, విక్రయాల వివరాలను దుకాణం వద్ద బోర్డుపై ప్రదర్శించాలి.
అప్రమత్తంగా ఉన్నాం..: నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. రైతులు విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. నకిలీ విత్తనాల కట్టడికి ఇప్పటికే వ్యవసాయశాఖ అప్రమత్తమయింది. తనిఖీలు పెంచడంతో పాటు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాం. రైతులు దళారుల మాటలు నమ్మవద్దు. సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి