ఆంగ్లం.. కాస్త కష్టపడుదాం
ఆంగ్లం అనగానే ప్రతి విద్యార్థికి ఎంతో కొంత భయం ఉంటుంది. ప్రత్యేక ధ్యాస పెట్టి.. పదాలు అర్థం చేసుకొని, తప్పులు లేకుండా రాయగలిగితే.. మంచి మార్కులు సాధ్యం.
పక్కా ప్రణాళికతో మార్కులు సాధ్యం
న్యూస్టుడే, మెదక్
ఆంగ్లం అనగానే ప్రతి విద్యార్థికి ఎంతో కొంత భయం ఉంటుంది. ప్రత్యేక ధ్యాస పెట్టి.. పదాలు అర్థం చేసుకొని, తప్పులు లేకుండా రాయగలిగితే.. మంచి మార్కులు సాధ్యం. పదాల అర్థాలు తెలియాలంటే నిఘంటువును ఆశ్రయించాల్సిందే. వ్యాసాలలో పదాల కూర్పు తప్పనిసరి. ఈ సారి పది ఆంగ్లం ప్రశ్నాపత్రంలో పలు మార్పులు చేశారు. గతంలో పేపర్-1, 2గా ఉండేది. ఈ సారి ఒకే పేపర్గా మారింది. పార్ట్-ఏలో 60 మార్కులు, బిలో 20 మార్కులు ఉంటాయి. సులువుగా మార్కుల సాధనకు అనుసరించాల్సిన విధానాలు, ఇతర అంశాలు మెదక్ మండలం మక్తభూపతిపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు నూల పూర్ణచందర్రావు ‘ఈనాడు’తో పంచుకున్నారు.
అర్థం చేసుకుంటూ..
పార్ట్-ఏలో comprehension లోని రెండు ప్యాసేజీలు పుస్తకంలోని రీడింగ్ ఏ, బీ, సీల నుంచే వస్తాయి. వాటిని తప్పనిసరిగా చదవాలి. తద్వారా వోకాబ్యులరీ, ఎడిటింగ్లో అత్యధిక మార్కులు తెచ్చుకోవచ్చు. పుస్తకం చదవడం వల్ల పార్ట్-ఏలో 24 మార్కులు సాధించవచ్చు. గమనించాల్సిన విషయం ఏంటంటే పుస్తకంలోని రీడీంగ్ ఏ, బీ, సీలను చదివే సమయంలో అర్థం చేసుకోవాలి. ముఖ్య పదాల అర్థాలు, ఆయా పదాల పర్యాయాలు (synonyms), వ్యతిరేక పదాల (antonyms) ను దృష్టిలో ఉంచుకొని చదవాలి. ఇందుకు మంచి ఆంగ్లం-తెలుగు నిఘంటువు, synonyms, antonyms (Thesaurus) ను తప్పనిసరిగా వాడే అలవాటు చేసుకోవాలి. ఇది 5 మార్కులు కచ్చితంగా సాధించవచ్చు. పార్ట్-ఏలో ఇచ్చే comprehension, unseen passages ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి దోహదపడుతుంది.
* అంతే కాకుండా ఈ సారి కొత్తగా స్టడీ స్కిల్, గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిపై ప్రశ్నలు ఇస్తారు. వాటిని అర్థం చేసుకొని సమాధానాలు రాయాలి. దీనికి 5 మార్కులు.
* ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఆక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, సింథెసిస్, కండిషనల్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వర్బ్ ఫార్మ్స్, ట్యాగ్ ప్రశ్నలు అడుగుతారు. వీటిపై పట్టు సాధించాలంటే గ్రామర్ పుస్తకంలోని అభ్యాసాలతో పాటు ఉపాధ్యాయుడు ఇచ్చినవీ సాధన చేయాలి.
తప్పులు లేకుండా..
ఇక డిస్కర్సెస్ విషయానికి వస్తే 20 మార్కులు కేటాయించారు. ఒక్క దానికి 10 మార్కులు. ఇందులో ఆప్షన్ ఉంటుంది. రెండు మైనర్ డిస్కర్సెస్ 5+5 మార్కులు కేటాయించారు. ఇందులో ఆప్షన్ ఉండదు. ఈ మూడు ప్రశ్నలు పుస్తకంలో ఇవ్వబడిన ఎనిమిది థీమ్స్ ఆధారంగా ఇస్తారు. అనగా పుస్తకాన్ని బాగా చదివి అందులో ఇవ్వబడిన డిస్కర్స్ను సాధన చేయాలి. విద్యార్థులు సొంతంగా సాధారణ ఆంగ్ల భాషలో తప్పులు లేకుండా రాయడం క్రమంగా అలవాటు చేసుకోవాలి. చక్కని చేతి రాతలో తప్పులు లేకుండా ఉండటం ఎంతో ముఖ్యం.
పార్ట్-బీలో..
ఇందులో మొదట అన్సీన్ ప్యాసేజ్ లేదా అన్సీన్ పద్యం వస్తుంది. దీన్ని అర్థం చేసుకుంటే సమాధానాలు రాయడం సులభం. ఒక వేళ అన్సీన్ పద్యం వస్తే సాధారణ ప్రశ్నలతో పాటు ఒకటి లేదా రెండు ఆంగ్లం అలంకారాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై అవగాహన ఉండటం తప్పనిసరి. తర్వాత ఎడిటింగ్లో నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో ఐదు పదాలు తప్పులు ఇచ్చి వాటిని సరిచేయమని అడుగుతారు. అందుకు రీడింగ్, ఏ, బీ, సీ పూర్తిగా అవగాహనతో చదవాలి. ఆబ్జెక్టివ్ టైపులో 5 ఖాళీలు ఇచ్చి వాటిని పూరించమంటారు. ఇది అన్సీన్ ప్యాసేజ్. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని సమాధానాలు రాయాలి.
* చివరిగా వోకాబ్యులరీపై పుస్తకంలో నుంచి ఐదు ప్రశ్నలు వస్తాయి. దీనిలో అర్థాలు, సిననిమ్స్, ఆంటనిమ్స్, హోమోఫోన్స్, తప్పుల పదాలు వంటివి ఇచ్చి సరిచేయమని అడుగుతారు. అందుకు పుస్తకాన్ని పూర్తి విశ్లేషణతో చదవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
[ 19-04-2024]
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, -
అట్టహాసంగా ఆరంభం
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉదయం 11 గంటలకు రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. -
గూడు పూర్తికాక.. నీడ లేక
[ 19-04-2024]
గత ప్రభుత్వం పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేసింది. దీంతో అవి నిరుపయోగంగా మారాయి. -
రేషన్ ఈ-కేవైసీకి మరో అవకాశం
[ 19-04-2024]
ఆహార భద్రతా కార్డుల ఈ-కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి
[ 19-04-2024]
నర్సాపూర్లోని హైదరాబాద్ మార్గంలో మల్లన్న గుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సాధారణ ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్ష్ గురువారం తనిఖీ చేశారు. -
ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 19-04-2024]
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. -
సువిధతో.. అంతా అరచేతిలోనే..
[ 19-04-2024]
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తోంది.. ఏదైనా స్మార్ట్గా జరిగిపోవాల్సిందే.. కాగితాలతో పని లేకుండా.. దూరాభారం కాకుండా ఉన్న చోటే క్షణాల్లో పని ముగించుకునే వెసులుబాటు కలిగింది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానని.. యువకుడి వాట్సాప్ వీడియో
[ 19-04-2024]
చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నానని యువకుడు పంపిన వీడియో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు రక్షించారు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. -
గెలిపించండి.. కొట్లాడే బలాన్నివ్వండి: హరీశ్రావు
[ 19-04-2024]
అబద్ధపు హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని, భారాసకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వంపై కొట్లాడే బలాన్ని ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. -
‘ఆర్నెల్లకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తా’
[ 19-04-2024]
నిరుద్యోగ భృతి ఇస్తానని దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్రావు మోసం చేశారని మెదక్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. -
ప్రచారం.. ఇక ముమ్మరం
[ 19-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. -
వలపు వలతో అసలుకే ఎసరు
[ 19-04-2024]
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఒకరు, వలపు వలలో చిక్కుకుని మరొకరు ‘సైబర్’ బాధితులుగా మారారు. సంబంధిత వివరాలను సిద్దిపేట పోలీసు కమిషనర్ అనూరాధ గురువారం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె