రుణం.. అ‘ద్వితీయం
స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ‘కొత్త వ్యాపారాల’ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మహిళల ఆసక్తికి అనుగుణంగా రుణాలను అందజేస్తోంది.
రాష్ట్రంలో జిల్లా మెరుగైన పని తీరు
దుకాణాన్ని పరిశీలిస్తున్న సెర్ప్ అధికారులు
న్యూస్టుడే-మెదక్: స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ‘కొత్త వ్యాపారాల’ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మహిళల ఆసక్తికి అనుగుణంగా రుణాలను అందజేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం కంటే ఎక్కువ మందికి ఇచ్చి, ‘మెతుకుసీమ’ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయ స్థానంలో నిలిచింది.
జిల్లాలోని 21 మండలాల్లో 13,308 స్వయం సహాయక సంఘాలు, 1.13 లక్షల మంది సభ్యులున్నారు. వీరిలో అర్హత ఉన్న సంఘాలకు బ్యాంకు లింకేజీ లేదా స్త్రీనిధి ద్వారా రుణాలను అందజేస్తున్నారు. అయితే వ్యాపార నిర్వహణకు వీటి వినియోగం తక్కువగా ఉంది. ఈ విషయాన్ని సెర్ప్ అధికారులు గుర్తించారు. దీనిని అధిగమించేందుకు గత ఆర్థిక సంవత్సరంలో ‘కొత్త వ్యాపారాలు’(న్యూ ఎంటర్ప్రైజెస్) పేరిట కార్యక్రమం చేపట్టింది. సంఘాల నుంచి ఎంపిక చేసిన సభ్యులను ముందుగా వారు చేసే వ్యాపారం గురించి వివరాలు సేకరించి, వారికి రుణం అందజేస్తున్నారు. 2021-22లో జిల్లాలోని ఇరవై మండలాల్లో 2,624 మందికి రూ.26.24 కోట్లు ఇచ్చారు.
ఈ ఏడాదిలో..
ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో 2022-23లోనూ మరింత మందికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
ఈ సారి 3,958 మందికి రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యమైనా, 3,961 మందికి రూ.58.20 కోట్లు పంపిణీ చేశారు.
ఇది గతేడాది కంటే రూ.31.96 కోట్లు అదనం. ఇందులో సామాజిక పెట్టుబడి ద్వారా 2,053 యూనిట్లకు రూ.27.37 కోట్లు, బ్యాంకు లింకేజీ ద్వారా 1,901 యూనిట్లకు రూ.30.82 కోట్లు, స్త్రీనిధి ద్వారా ఏడుగురికి రూ.8లక్షలు మంజూరయ్యాయి. కొత్త వ్యాపారాలకు రుణాలివ్వడంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవగా, మెదక్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. మహిళలు తమకు అవసరం ఉన్న మేరకు రుణాలు పొందారు. రూ.75 వేల నుంచి అత్యధికంగా రూ.8 లక్షల వరకు అందజేశారు. పాపన్నపేట మండలంలో అత్యధికంగా 282, ఉమ్మడి చేగుంట మండలంలో 274 యూనిట్లు ఇవ్వగా, అత్యల్పంగా చిలప్చెడ్ మండలంలో 111 యూనిట్లకు రుణాలిచ్చారు. వీరంతా ట్రేడింగ్, ఉత్పత్తి, సేవల రంగాల్లో దుకాణాలను ఏర్పాటు చేశారు.
సొంతంగా ఏర్పాటు
- కవిత, పెద్దచింతకుంట, నర్సాపూర్
గతంలో పౌల్ట్రీఫాం లీజుకు తీసుకొని ఐదేళ్ల పాటు నిర్వహించా. నెలకు వచ్చే ఆదాయంలో లీజుదారుకు, ఖర్చులు పోను కొంత డబ్బు మిగిలేది. వ్యాపార నిర్వహణకు రుణం అందిస్తున్నారని తెలియడంతో రూ.4 లక్షలు తీసుకుని సొంతంగా ఏర్పాటు చేశా. ప్రస్తుతం వచ్చే ఆదాయంలో కొంత రుణం చెల్లించి, మిగిలినది కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నా.
అప్పు పోను కుటుంబ అవసరాలకు
- అంజమ్మ, రాజ్పల్లి, మెదక్ మండలం
మాది వడ్రంగి వృత్తి కావడంతో నా భర్త ద్వారా సొంతంగా దుకాణం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల రుణం తీసుకున్నా. కంప్యూటర్తో తలుపులపై డిజైన్లు వేసే కొత్త యంత్రాలను కొనుగోలు చేశాం. ప్రస్తుతం నలుగురు ఉపాధి పొందుతున్నారు. నెలకు రూ.40వేల వరకు ఆదాయం లభిస్తోంది. రుణ చెల్లింపు, మిగతా ఖర్చులు పోను నెలకు రూ.20 వేలు మిగులుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..