Harish Rao: ఈ జన్మంతా మీకే అంకితం..
‘ఈ జన్మంతా మీకే (సిద్దిపేట) అంకితం.. నేను ఎంత చేసినా తక్కువే. మీరు చూపిన ప్రేమ ఆదరాభిమానాలు వెలకట్టలేనివి. సిద్దిపేట ప్రజలంతా నా కుటుంబ సభ్యులు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, తల్లిదండ్రులుగా భావించి సేవ చేశా..’ అని మంత్రి, సిద్దిపేట భారాస అభ్యర్థి హరీశ్రావు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.
మంత్రి హరీశ్రావు
సిద్దిపేట: ‘ఈ జన్మంతా మీకే (సిద్దిపేట) అంకితం.. నేను ఎంత చేసినా తక్కువే. మీరు చూపిన ప్రేమ ఆదరాభిమానాలు వెలకట్టలేనివి. సిద్దిపేట ప్రజలంతా నా కుటుంబ సభ్యులు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, తల్లిదండ్రులుగా భావించి సేవ చేశా..’ అని మంత్రి, సిద్దిపేట భారాస అభ్యర్థి హరీశ్రావు(Harish Rao) భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మంగళవారం సిద్దిపేటలో ఆయన ప్రచారం నిర్వహించారు. స్థానిక వేములవాడ కమాన్ నుంచి బస్టాండ్ వరకు ప్రధాన వీధుల మీదుగా రోడ్షో సాగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు గులాబీ పూల వర్షం కురిపించారు. భారీ గజమాలతో స్వాగతం పలికారు. రోడ్షో ముగింపు సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొందరు నాయకులు ఎన్నికలున్నపుడే తిరుగుతారని, తాను నిత్యం ఎన్నికల మాదిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేశానన్నారు. సిద్దిపేటనే నా కుటుంబమని మంత్రి పేర్కొన్నారు. కార్యకర్తలే ఒక్కో హరీశ్రావు లాగా పని చేశారని, వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.
మోసపోవద్దు..
చేగుంట: దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లు భాజపాకు ఓట్లు వేసి మోసపోయి ఇప్పుడు గోసపడుతున్నారని, మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మంత్రి హరీశ్రావు ప్రజలకు సూచించారు. మంగళవారం వడియారం నుంచి చేగుంట వరకు నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్రావు ఎన్నో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్రెడ్డి తన తండ్రి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో కూడా భారాస ప్రభుత్వం వస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక స్థానిక సమరం
[ 18-05-2024]
మరో ఎన్నికల సందడి రానుంది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో పరిపాలనపై దృష్టి సారించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. -
కొనుగోళ్లలో జాప్యంపై కర్షకుల కన్నెర్ర
[ 18-05-2024]
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని మిన్పూర్ గ్రామ రైతులు శుక్రవారం మెదక్-బోడ్మట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. -
సొంతింటి కల..నెరవేరేనా?
[ 18-05-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రంలో నిర్మించిన కొన్ని ఇళ్ల పనులు కొసరు పనులతో నిలిచిపోగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. -
భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించండి
[ 18-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం భారాస అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని భాజపా మెదక్ అభ్యర్థి ఎం.రఘునందన్రావు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. -
ఉపాధి కూలీలకు ఊరట
[ 18-05-2024]
ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
ఒక్క రూపాయైనా జమ కాలేదు
[ 18-05-2024]
జిల్లావ్యాప్తంగా యాసంగిలో రైతులు ఉత్సాహంగా జొన్న పంట సాగు చేశారు. దిగుబడులు చేతికొస్తున్నాయి. -
శిథిల భవనాలు.. కానరాని చర్యలు
[ 18-05-2024]
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం జనం ప్రాణాలను బలిగొంటోంది. -
పల్లెల్లో మొదలైన సందడి
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారా..? అనే ప్రశ్నకు అవుననే సంకేతాలు వస్తున్నాయి. -
గుర్తించని జోన్లు.. ట్రాఫిక్ ఇక్కట్లు
[ 18-05-2024]
పట్టణాల్లో వ్యాపార జోన్లు అటకెక్కాయి. వ్యాపారాలు రహదారుల వెంట కాకుండా.. పురపాలక సంఘాలు ఏర్పాటు చేసిన జోన్లలో నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొంచడంలో యంత్రాంగం విఫలమయిందనే విమర్శలొస్తున్నాయి. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వాన రాకతో ధాన్యం ఆరక..
[ 18-05-2024]
వేసవికాలంలో జిల్లాలో వాతావరణంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. -
నచ్చిన కోర్సు ఎంచుకోండి దోస్త్
[ 18-05-2024]
ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. డిగ్రీ కోర్సుల వైపు చూసే వారే ఎక్కువ మందే ఉంటారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం
[ 18-05-2024]
ప్రజాప్రయోజనంతో చేపట్టే అభివృద్ధి పనుల పర్యవేక్షణ లోపించి ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
నాన్నను కొట్టి.. పశ్చాత్తాపం చెంది..
[ 18-05-2024]
ఆవేశంలో అకారణంగా నాన్నను కొట్టి.. అనంతరం తండ్రి తప్పేమీ లేదని తెలుసుకున్న కుమారుడు పశ్చాత్తాపంతో ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి