Harish Rao: ఈ జన్మంతా మీకే అంకితం..
‘ఈ జన్మంతా మీకే (సిద్దిపేట) అంకితం.. నేను ఎంత చేసినా తక్కువే. మీరు చూపిన ప్రేమ ఆదరాభిమానాలు వెలకట్టలేనివి. సిద్దిపేట ప్రజలంతా నా కుటుంబ సభ్యులు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, తల్లిదండ్రులుగా భావించి సేవ చేశా..’ అని మంత్రి, సిద్దిపేట భారాస అభ్యర్థి హరీశ్రావు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.
మంత్రి హరీశ్రావు
సిద్దిపేట: ‘ఈ జన్మంతా మీకే (సిద్దిపేట) అంకితం.. నేను ఎంత చేసినా తక్కువే. మీరు చూపిన ప్రేమ ఆదరాభిమానాలు వెలకట్టలేనివి. సిద్దిపేట ప్రజలంతా నా కుటుంబ సభ్యులు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, తల్లిదండ్రులుగా భావించి సేవ చేశా..’ అని మంత్రి, సిద్దిపేట భారాస అభ్యర్థి హరీశ్రావు(Harish Rao) భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మంగళవారం సిద్దిపేటలో ఆయన ప్రచారం నిర్వహించారు. స్థానిక వేములవాడ కమాన్ నుంచి బస్టాండ్ వరకు ప్రధాన వీధుల మీదుగా రోడ్షో సాగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు గులాబీ పూల వర్షం కురిపించారు. భారీ గజమాలతో స్వాగతం పలికారు. రోడ్షో ముగింపు సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొందరు నాయకులు ఎన్నికలున్నపుడే తిరుగుతారని, తాను నిత్యం ఎన్నికల మాదిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేశానన్నారు. సిద్దిపేటనే నా కుటుంబమని మంత్రి పేర్కొన్నారు. కార్యకర్తలే ఒక్కో హరీశ్రావు లాగా పని చేశారని, వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.
మోసపోవద్దు..
చేగుంట: దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లు భాజపాకు ఓట్లు వేసి మోసపోయి ఇప్పుడు గోసపడుతున్నారని, మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మంత్రి హరీశ్రావు ప్రజలకు సూచించారు. మంగళవారం వడియారం నుంచి చేగుంట వరకు నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్రావు ఎన్నో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్రెడ్డి తన తండ్రి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో కూడా భారాస ప్రభుత్వం వస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి