పథకం బాగు.. పనుల్లో జాగు
బడులు బాగు చేసేందుకు గత సర్కారు నడుం బిగించింది. కార్పొరేట్ హంగులు అద్దాలనుకుంది. గతేడాది జిల్లాలో ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాత భవనాలను గుర్తించి అక్కడ కొత్తవి కట్టాలని సంకల్పించింది.
నత్తనడకన ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమం
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
కోహీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పునాది స్థాయిలో నిర్మాణం
న్యూస్టుడే- సంగారెడ్డి అర్బన్, కోహీర్ : బడులు బాగు చేసేందుకు గత సర్కారు నడుం బిగించింది. కార్పొరేట్ హంగులు అద్దాలనుకుంది. గతేడాది జిల్లాలో ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాత భవనాలను గుర్తించి అక్కడ కొత్తవి కట్టాలని సంకల్పించింది. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. గుత్తేదారులు, ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. పనులు పూర్తి కాకపోవడంతో అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో చదువుకుంటున్నారు.
ముందుకు రాని గుత్తేదారులు
జిల్లాలోని అమీన్పూర్, అందోల్, పుల్కల్, చౌటకూర్, కల్హేర్, కంగ్టి, మునిపల్లి, నాగల్గిద్ద, నారాయణఖేడ్, హత్నూర, మొగుడంపల్లి, పటాన్చెరు, రామచంద్రాపురం, జహీరాబాద్, గుమ్మడిదల, మనూర్, సదాశివపేట, సంగారెడ్డి, సిర్గాపూర్, వట్పల్లి మండలాల్లోని ప్రభుత్వ బడులను మన ఊరు.. మన బడి కార్యక్రమంలో ఎంపిక చేశారు. పనులు చేసేందుకు గతేదాడి నుంచి టెండర్లు పిలిచినా గుత్తేదారులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. రూ.30 లక్షల పైచిలుకు పనులను టెండర్లు పాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
పనుల్లో వేగం పెంచుతాం..: జగదీశ్వర్, పీఆర్ ఈఈ, సంగారెడ్డి
జిల్లాలో మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా పనులు వేగంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. త్వరలో పీఆర్ శాఖ అధికారులు, గుత్తేదారులతో సమావేశం నిర్వహిస్తాం. పనులు నాణ్యంగా చేసేలా చర్యలు తీసుకుంటాం.
క్షేత్ర స్థాయిలో ఇలా..
- కోహీర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో భవన నిర్మాణానికి రూ.14.47 లక్షలు మంజూరు చేశారు. గుత్తేదారులు, పీఆర్ ఏఈల మధ్య సమన్వయ లోపంతో పనులు పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయాయి. గదుల కొరత కారణంగా రెండు విడతలుగా తరగతులు నిర్వహించాల్సి వస్తోంది.
- అందోలు ప్రాథమికోన్నత పాఠశాలలో పనులే ప్రారంభం కాలేదు. పాఠశాల ఆవరణలో గదుల మరమ్మతులు, ప్రహరీ, కరెంటు పనులు, కిచెన్ షెడ్, మూత్రశాలల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం రూ.63 లక్షలు మంజూరు చేసింది. అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచారు. గుత్తేదారులెవరూ పాల్గొనలేదు.
- సదాశివపేట మండలంలోని నందికంది, పెద్దాపూర్, కోనాపూర్, సదాశివపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలకు రూ.30.లక్షలకుపైగా నిధులు మంజూరైనా పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు.
- సంగారెడ్డి మండలంలో రూ.30 లక్షల పనులకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో రెండు బడులకు మాత్రమే పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపారు. మిగిలిన వాటికి ముందుకు రావడం లేదు.
- కంది మండలం ఇంద్రకరణ్, ఎద్దుమైలారం, ఓడీఎఫ్లో ప్రభుత్వ బడుల్లో పలు రకాల పనులు చేపట్టడానికి రూ.30 లక్షలకు ప్రతిపాదనలు పంపారు. పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. ఇంద్రకరణ్లో ప్రభుత్వ పాఠశాలకు రూ.20 లక్షలతో ప్రహరీ పనులు చేపట్టి మధ్యలోనే ఆపేశారు.
జిల్లాలో పనులు ఇలా..
- జిల్లాలో మంజూరైన పనులు: 329
- నిధుల అంచనా: రూ.129.17 కోట్లు
- ఇప్పటి వరకు పూర్తయిన పనులు: 151
- వివిధ దశల్లో ఉన్నవి: 139
- టెండర్లు పిలవనివి: 36
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే