పల్లె పోరుకు కసరత్తు
శాసన సభ ఎన్నికలు ముగిశాయి. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మధ్యలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తారా? అనే ప్రశ్నకు అధికారుల నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా కంది మండలం తోపుగొండ గ్రామం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: శాసన సభ ఎన్నికలు ముగిశాయి. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మధ్యలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తారా? అనే ప్రశ్నకు అధికారుల నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని గుర్తించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు సైతం వచ్చాయి.
మార్గదర్శకాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారుల నియామకానికి మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. ఒక్కో పంచాయతీకి ఒకరు చొప్పున స్టేజ్-1 అధికారి ఉంటారు. వీరు నామినేషన్ల స్వీకరణ నుంచి గుర్తులు కేటాయించే వరకు పనులు చూసుకుంటారు. స్టేజ్-2 అధికారులు పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. పోలింగ్ కేంద్రంలో 200 మంది వరకు ఓటర్లు ఉంటే ప్రిసైడింగ్ అధికారితోపాటు పోలింగ్ అధికారి ఉంటారు. 201-400 మంది ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు ఇద్దరు పోలింగ్ అధికారులు, 401-650 మంది ఓటర్లు ఉంటే ప్రిసైడింగ్ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమిస్తారు. 650 మందికంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే అదనపు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ నెల 30లోగా ప్రక్రియను పూర్తిచేయనున్నారు.
పాత రిజర్వేషన్లేనా?
2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 1, 2024తో పాలకవర్గాల గడువు ముగియనుంది. గత ఎన్నికల సమయంలో కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్ విధానం అమలులో ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పాత విధానాన్నే కొనసాగిస్తారా? మార్పులు ఏమైనా ఉంటాయా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం