సైనికులారా జోహార్
కన్నవారికి.. ఉన్న ఊరికి దూరంగా ఉంటూ.. మాతృభూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. ప్రజల సంక్షేమం కోసం నిఘా నేత్రంతో విధులు నిర్వహిస్తారు. శత్రు సైన్యం భారత భూభాగంలో అడుగు పెట్టకుండా తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతారు.
సంక్షేమ నిధి.. విరాళం అందరి విధి
నేడు సాయుధ దళాల పతాక దినోత్సవం
మాజీ సైనికుల సమస్యలు తెలుసుకుంటున్న మద్రాసు రెజిమెంటల్ అధికారులు
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ, : సంగారెడ్డి టౌన్: కన్నవారికి.. ఉన్న ఊరికి దూరంగా ఉంటూ.. మాతృభూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. ప్రజల సంక్షేమం కోసం నిఘా నేత్రంతో విధులు నిర్వహిస్తారు. శత్రు సైన్యం భారత భూభాగంలో అడుగు పెట్టకుండా తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతారు. దేశం కోసం ఇంత చేసిన వారికి చేయూత ఇవ్వడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి. యుద్ధ భూమి నుంచి తిరిగి వచ్చిన సైనికులకు, వితంతువులు, వారి కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. నేడు సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కథనం.
75 ఏళ్లుగా నిర్వహణ
మాజీ సైనికులు, వారి పిల్లల సంక్షేమానికి ఏర్పాటుచేసిన నిధికి విరాళాలు సేకరించే ఉద్దేశంతో సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా డిసెంబరు 7న సైనిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో 75 ఏళ్లుగా చేపడుతున్నారు.
అండగా ఉంటూ..
సైనికుల కోసం 1948లో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ నిధిని ఏర్పాటుచేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి అధ్యక్షుడిగా, సభ్యులుగా సహాయ మంత్రి, ఆర్మీ, నావికా, వాయుసేన దళాల సైన్యాధ్యక్షులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో సైనిక సంక్షేమ నిధికి అధ్యక్షుడిగా రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడిగా, వివిధ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వీరమణం పొందిన సైనికులతోపాటు సమస్యల్లో ఉన్న వారి కుటుంబీకులకు, క్షతగాత్రులైన సైనికులకు అండగా ఉండేందుకు విరాళాలు సేకరిస్తారు.
మాజీ సైనికులకు ప్రయోజనాలు
- గ్రూప్ 2, గ్రూప్ 4లో రిజర్వేషన్లు
- వివాహం కోసం ఆర్థిక సాయం రూ.40 వేలు (ఇద్దరు కుమార్తెల వరకు)
- మాజీ సైనికుడు మరణిస్తే కుటుంబానికి రూ.10 వేలు, భార్య, కుమారుడు, కూతురు మరణించినా అంతే మొత్తం అందజేస్తారు
- స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కోసం పావలా వడ్డీపై రుణ సదుపాయం కల్పిస్తారు
- ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు
- సీఎస్డీ క్యాంటీన్ ద్వారా వ్యాట్ మినహాయింపుపై సరుకులు
- మాజీ సైనికుల పిల్లల ఉన్నత చదువుకోసం కోర్సును బట్టి ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.36 వేల వరకు అందిస్తారు.
పథకాలు అమలయ్యేలా చర్యలు
తిసైనికులు, వారి కుటుంబాలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. సైనిక సంక్షేమ నిధికి విరాళాలు ఇవ్వడం ద్వారా వారికి చేయూతనిచ్చిన వారమవుతాం. సైనికుల సంక్షేమానికి తమ శాఖ తరఫున సేవలిందిస్తున్నాం. ప్రభుత్వపరంగా వారికి ఉన్న పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
సత్యశ్రీ, ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే