నిధులున్నా.. పనులు సున్నా
పలు గ్రామాలకు ప్రధానమైన తారు రోడ్లు పాడై ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. రోడ్లు బాగా లేవని ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నారు. పాడైపోతాయనే భయంతో ప్రైవేటు వాహనాలను తిప్పడానికి కూడా కొందరు సాహసించడం లేదు.
అధ్వానంగా కొండాపూర్-నత్నాయిపల్లి గ్రామాల మధ్య రోడ్డు
న్యూస్టుడే, నర్సాపూర్: పలు గ్రామాలకు ప్రధానమైన తారు రోడ్లు పాడై ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. రోడ్లు బాగా లేవని ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నారు. పాడైపోతాయనే భయంతో ప్రైవేటు వాహనాలను తిప్పడానికి కూడా కొందరు సాహసించడం లేదు. రోడ్లు బాగున్న మార్గాల వైపు దారి మళ్లిస్తున్నారు. అధ్వానమైన గ్రామీణ రోడ్లను బాగు చేయడానికి ఏడాది క్రితం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ రోడ్ల పనులు చేసేందుకు రెండు సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. మూడోసారికి టెండరు ప్రక్రియ పూర్తిచేసి ఒప్పందం సైతం చేసినా పనుల ప్రారంభంలోనే తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పనులు త్వరితగతిన పూర్తయితే రోడ్లు బాగుపడి రవాణా సౌకర్యాలు మరింతగా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.
తరచూ ప్రమాదాలు
చాలా గ్రామాలకు వెళ్లే రోడ్లు గోతులతో కయ్యలు ఏర్పడి, కంకర తేలి, దుమ్మూధూళితో దర్శనమిస్తున్నాయి. రోడ్లు బాగైతే ప్రజలకు దూరభారం తగ్గుతుంది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను సాఫీగా మార్కెట్కు తరలించే అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలోని నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, హత్నూర, కొల్చారం, చిలప్చెడ్ మండలాల్లోని చాలా గ్రామాలకు తారు రోడ్లు నిర్మాణం జరిగిన నాటి నుంచి నిర్వహణ లేక తారు తొలగిపోయి, గుంతలు ఏర్పడి, కంకర తేలి ప్రజలకు నరకం చూపుతున్నాయి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధీనంలోని ఈ రోడ్లు ప్రస్తుతం ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఇరుకైన రోడ్లపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వర్షాకాలంలో లోతైన గోతుల్లో నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
మార్చిలో టెండర్లు
నర్సాపూర్ మండలం కొండాపూర్-వయా కాగజ్మద్దూర్ మీదుగా నత్నాయిపల్లి, శేర్కాన్పల్లి వరకు ఉన్న తారు రోడ్డుకు రూ.2.67కోట్లు, రెడ్డిపల్లి వయా ఖాజీపేట మీదుగా రాజిపేట వరకు రూ.2.15కోట్లు, చిప్పల్తుర్తి-గోవింద్రాజ్పల్లి గ్రామాల మధ్య రోడ్డుకు రూ.2.90కోట్లు కేటాయించారు. శివ్వంపేట మండలం పోతులబోగుడ వయా ఉసిరికపల్లి, ఏదుల్లాపూర్, పాంబండ, భీమ్లా తండా వరకు రోడ్డుకు రూ.1.04కోట్లు, రత్నాపూర్-శివ్వంపేట, పిల్లుట్ల పూర్య తండా వరకు ఉన్న రోడ్డుకు రూ.1.40కోట్లు, సంగారెడ్డి-తూప్రాన్ రోడ్డు నుంచి వయా ఉసిరికపల్లి వయా ఏదుల్లాపూర్ రోడ్డుకు రూ.1.03కోట్లు, పిల్లుట్ల పిడబ్ల్యుడి రోడ్డు నుంచి తిమ్మాపూర్, గేమ్సింగ్ తండా రోడ్డుకు రూ.1.06కోట్లు నిధులు మంజూరయ్యాయి. పనులు చేపట్టడానికి రెండు సార్లు టెండర్ ప్రక్రియను చేపట్టినా ఎవరూ ముందుకు రాలేదు. మూడోసారి ఒకరు ముందుకు వచ్చారు. ఈ ఏడాది మార్చిలో టెండర్లు ఖరారు కాగా అగ్రిమెంట్ పూర్తిచేశారు. అయితే పనులు ప్రారంభంలోనే తీవ్ర జాప్యం జరుగుతుందని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. వెల్దుర్తి మండలం అందుగులపల్లి-మానెపల్లి రోడ్డు, వెల్దుర్తి జడ్పీ రోడ్డు నుంచి రెడ్డిగూడెం వరకు గల రోడ్డు, ఉప్పులింగాపూర్-దర్పల్లి రోడ్డు పనులు ఇటీవల పూర్తయ్యాయి. మిగతా వాటి విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.
తగిన చర్యలు తీసుకుంటాం
- రాధికాలక్ష్మి, డీఈ, పీఆర్
గ్రామీణ రోడ్లకు నిధులు మంజూరు కావడం టెండరు ప్రక్రియను పూర్తిచేయడం జరిగింది. పనులు పొందిన వారు దశల వారీగా చేపడుతూ వస్తున్నారు. పనులు చేసినా బిల్లులు సకాలంలో రావడం లేదని ఈ పనులు ప్రారంభించడానికి గుత్తేదారు వెనకాడుతున్నారు. సంబంధిత గుత్తేదారుతో మాట్లాడి వీలైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యో విధంగా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?