బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై కేసు
బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు అల్లాదుర్గం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు..
అల్లాదుర్గం: బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు అల్లాదుర్గం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు.. అదే గ్రామానికి చెందిన మైనర్తో మూడు నెలల కిందట వివాహం నిశ్చయమైంది. అప్పట్లోనే విషయం తెలియంతో ఐసీడీఎస్ అధికారులు ఇరు కుటుంబ సభ్యులను, యువకుడిని, బాలికను మెదక్లోని ఐసీడీఎస్ కార్యాలయానికి రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహంతో కలిగే నష్టాలను వివరించారు. కొన్ని రోజులకు పెళ్లి చేసుకోగా విషయం గురువారం తెలిసింది. దీనిపై ఐసీడీఎస్ అధికారులు అల్లాదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యువకుడిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
పోక్సో కేసులో ఒకరికి జైలు, జరిమానా
సిద్దిపేట అర్బన్, న్యూస్టుడే: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఫోక్సో కేసులో సిద్దిపేట న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధించింది. పట్టణ మూడో ఠాణా సీఐ భానుప్రకాశ్ తెలిపిన వివరాలు.. మూడో ఠాణా పరిధిలోని ఓ గ్రామంలో 2021 జూన్ 12న రాములు అనే వృద్ధుడు బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సంపత్ కేసు పెట్టి నేరస్థుణ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు తదుపరి పరిశోధన పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ వేశారు. అప్పట్నుంచి విచారణ కొనసాగింది. వాదనలు విన్న న్యాయస్థానం గురువారం నేరస్థుడిపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసింది.
పోలీసుల అదుపులో మల్లన్న దేవాలయ ఆడిటర్
నంగునూరు(చేర్యాల), కొమురవెల్లి, న్యూస్టుడే: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఐటీ, జీఎస్టీ రిటర్నుల దాఖలు నిధుల దుర్వినియోగంపై ఆలయ ఈవో బాలాజీ ఫిర్యాదు మేరకు పోలీసులు కొన్ని రోజుల కిందట దేవాలయ ఆడిటర్ ధనుంజయపై కేసు పెట్టారు. ఈ మేరకు గురువారం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ విషయమై చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా.. ధనుంజయను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, చట్ట ప్రకారం చర్యలుంటాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు