ఇంట్లో శుభకార్యం.. అంతలోనే విషాదం
కొత్త ఇంటి సంబరం.. కుటుంబీకులు, బంధువులతో సందడిగా ఉంది.. అందరూ సంతోషంగా ఉన్నారు.. ఇంతలోనే సరకులు తెచ్చేందుకు సైకిల్పై వెళ్లిన బాలుడిని మృత్యురూపంలో కంటెయినర్ దూసుకొచ్చి బలితీసుకోవడంతో ఆ ఇంట విషాదం నెలకొంది.
రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం
నగేష్
చేగుంట, న్యూస్టుడే: కొత్త ఇంటి సంబరం.. కుటుంబీకులు, బంధువులతో సందడిగా ఉంది.. అందరూ సంతోషంగా ఉన్నారు.. ఇంతలోనే సరకులు తెచ్చేందుకు సైకిల్పై వెళ్లిన బాలుడిని మృత్యురూపంలో కంటెయినర్ దూసుకొచ్చి బలితీసుకోవడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. ఈ ఘటన చేగుంట మండలం మక్కరాజుపేటలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ హరీశ్ తెలిపిన వివరాలు.. మక్కరాజుపేటకు ఎర్రగొల్ల రమేష్, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నగేష్ (11), చిన్న కుమారుడు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరు, నాలుగో తరగతి చదువుతున్నారు. వ్యవసాయమే జీవనాధారం. ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. గురువారం గృహప్రవేశం ఉండగా.. తెల్లవారుజామున కార్యక్రమం జరిగింది. 10 గంటల సమయంలో నగేష్ను సరకులు తీసుకురమ్మని సమీపంలోని ఓ దుకాణానికి పంపించారు. సైకిల్పై దుకాణానికి బయల్దేరాడు. రోడ్డు పక్కన మెల్లిగా వెళ్తున్నాడు. వేగంగా దూసుకొచ్చిన కంటెయినర్ వెనుక నుంచి బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో కంటెయినర్ డ్రైవర్ హరియాణాకు చెందిన హసీన్ చరవాణిలో మాట్లాడుతున్నాడు. విషయం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబీకులంతా ఘటనాస్థలికి చేరుకొని రోదించారు. కంటెయినర్ డ్రైవర్ను పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. తమకు న్యాయం చేయాలని గ్రామస్థులతో కలిసి చేగుంట-గజ్వేల్ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, రామాయంపేట సీఐ లక్ష్మిబాబు ఘటనా స్థలికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పేందుకు యత్నించగా ఫలితం లేకపోయింది. చివరకు కంటెయినర్ యజమానిని పిలిచించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ చెప్పారు.
ప్రమాదవశాత్తు కింద పడి కానిస్టేబుల్..
లక్ష్మణ్
వట్పల్లి, న్యూస్టుడే: ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించేలోపు కానిస్టేబుల్ లక్ష్మణ్ మృతి చెందినట్లు ఎస్సై కోటేశ్వర్రావు గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఖాదీరాబాద్ గ్రామానికి చెందిన పుట్ల లక్ష్మణ్(38) సంగారెడ్డిలోని ప్రత్యేక పోలీసు బలగాల విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా సంగారెడ్డిలోనే నివాసం ఉంటున్నారు. తన తల్లి రత్నమ్మను చూసి వెళ్లేందుకు సొంత గ్రామమైన ఖాదీరాబాద్కు బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తుండగా శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు వైద్య చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోనే లక్ష్మణ్ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య రమలీల గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. లక్ష్మణ్కు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి